యాప్నగరం

భర్త క్వారంటైన్‌లో ఉండగా ప్రియుడితో పరారైన భార్య

అదే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. భర్త హోమ్ క్వారంటైన్‌లో ఉండగా ప్రియుడితో వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 26 May 2020, 12:51 pm
దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా అనేక అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో జిల్లాలో ఇదే తరహాలో ఓ అఫైర్ బయటపడింది. భర్త హోమ్ క్వారంటైన్‌లో ఉన్న సయయంలోనే అతడి భార్య ప్రియుడితో వెళ్లిపోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. దేరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ ఢిల్లీలో నివాసముంటున్నాడు. ఏడాది క్రితం భార్య, పిల్లలతో కలిసి స్వగ్రామానికి వచ్చేయగా.. అతడు మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నాడు. భర్త అడ్డులేకపోవడంతో అదే గ్రామానికి ఓ వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది.
Samayam Telugu Image


Also Read: కామారెడ్డిలో విషాదం.. అప్పుల బాధతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడంతో ఆమె భర్త ఈ నెల 19 శ్రామిక్ రైల్లో ఢిల్లీ నుంచి ఛత్తర్‌పూర్ చేరుకున్నాడు. కోవిడ్-19 నిబంధనల ప్రకారం అతడు తన ఇంట్లోనే పై అంతస్తులో హోమ్ క్వారంటైన్‌లో ఉండగా.. భార్య, పిల్లలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. భర్త ఇంటికి వచ్చేయడంతో ఆమెకు ప్రియుడితో ఏకాంతంగా గడిపే సమయం దొరకడం లేదు. దీంతో ప్రియుడితో ఎక్కడికైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 24వ తేదీ రాత్రి సమయంలో భర్త ఉంటున్న గదికి గడియ పెట్టిన ఆమె ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం తల్లి కనిపించకపోవడంతో పిల్లలు తండ్రికి చెప్పారు. చుట్టుపక్కల వారిని విచారించగా ఆమె అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో తన భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: కన్నకూతురిపైనే కన్నేసిన కామపిశాచి.. భార్య, కొడుకు చేతిలో హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.