యాప్నగరం

ప్రియుడి ఇంటి ముందు భార్య తలను వేలాడదీసిన భర్త

భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలా అయిన భార్యను హతమార్చాలనుకున్నాడు. భార్యను నరికి తలను, మొండెంను వేరు చేశాడు.

Samayam Telugu 15 Oct 2020, 11:29 am
ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను మెడ నరికి అతి కిరాతకంగా హతమార్చారు. మహిళ మెడను ఓ చోట మొండెం మరో చోట వేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణ్‌ఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కిరాతకానికి ఒడిగట్టింది ఆమె భర్తేనని తెలిసింది. అనుమానంతో ఆమె తలనరికి హత్య చేశాడని సమాచారం. ఈ భయానక ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Samayam Telugu భార్య తల నరికిన భర్త
sanga reddy murder


ఈ పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల అనుసూజ (42), సాయిలు దంపతులు. భార్య అనుసూజ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త ప్రతికారంతో రగిలిపోయాడు. ఎలా అయిన భార్య అంతు చూడాలనుకున్నాడు. అదునుకోసం ఎదురు చూశాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం భార్య తలను నరికి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మొండాన్ని అనంతసాగర్‌లోనే వదిలేసి అనుసూజ తలను మాత్రం తీసుకువెళ్లి నారాయణఖేడ్‌లో నివాసం ఉంటున్న ఆమె ప్రియుడు జైపాల్‌రెడ్డి ఇంటి ఎదుట పడేశాడు.

Read More: తిరుపతిలో పాస్టర్ అకృత్యం.. యువతిని కొట్టి, బెదిరించి అత్యాచారం

అనంతరం భర్త సాయిలు వెళ్లి నారాయణఖేడ్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, ఘటనకు గల కారణాలను విచారిస్తున్నారు. హత్య జరిగి తీరుపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నారాయణఖేడ్‌లో ప్రియుడి ఇంటి వద్ద మహిళ తలను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామాంతో వణికిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.