యాప్నగరం

చీరకొంగు బిగించి చంపేసి హైడ్రామా.. విజయవాడలో దారుణం.. పోలీసుల ఎంట్రీతో..

పండుగకు పుట్టింటికి తీసుకెళ్లమనడమే ఆమె నేరమైంది. భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. భార్యను అమానుషంగా చంపేసిన భర్త.. ఆత్మహత్య చేసుకుందంటూ నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు.

Samayam Telugu 11 Apr 2020, 7:17 pm
ఈస్టర్ పండుగకు ఇంటికి వెళ్దామని అడిగినందుకు ఓ తాగుబోతు భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఇల్లాలిని ఇంట్లోనే మట్టుబెట్టాడు. చీరతో ఉరి బిగించి దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ హైడ్రామాకు తెరతీశాడు. తీరా పోలీసులు ఎంట్రీ ఇచ్చే సరికి అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరులో చోటుచేసుకుంది.
Samayam Telugu death1


కట్టుకున్న భార్యను అమానుషంగా చంపేసి ఆత్మహత్య చేసుకుందంటూ నమ్మించే యత్నం చేసిన కసాయి భర్త ఉదంతం వెలుగుచూసింది. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన సునీల్‌రాజుకి జి.కొండూరు మండలం పినపాకకు చెందిన చల్లా సౌజన్యతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. భార్యాభర్తలు పెనమలూరు పరిధిలోని కానూరు వినాయకనగర్‌లో నివాసం ఉంటున్నారు.

Read Also: చెరుకుతోటలో గర్భిణి శవం.. బట్టలు చించేసి రేప్‌ డ్రామా.. హంతకుడిని పట్టించిన హ్యాండ్‌రైటింగ్

నవతా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో క్లర్క్‌గా పనిచేసే సునీల్ రాజ్ మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవలు పడుతుండేవాడు. ఈస్టర్ పండుగ రావడంతో ఈ నెల 12న పుట్టింటికి తీసుకెళ్లాలని కోరింది సౌజన్య. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో ఆగ్రహానికి గురైన సునీల్ రాజ్ భార్యను ఇంట్లోనే దారుణంగా చంపేశాడు. చీరకొంగు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

అనంతరం ఏమీ ఎరగనట్టు తన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ హైడ్రామాకు తెరతీశాడు. అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. విషయం తెలియడంతో మృతురాలి కుటుంబ సభ్యులు వినాయక నగర్ చేరుకుని విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి భోరున విలపించారు. అల్లుడే తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడంటూ మృతురాలి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది.

Also Read: అపార్ట్‌మెంట్‌లో చోరీకి వెళ్లిన దొంగ.. టెర్రస్‌పై మహిళ ఒంటరిగా కనపడడంతో..

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. భార్యను దారుణంగా చంపేసి ఆత్మహత్య చేసుకుందంటూ నమ్మించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. భర్త అక్కడి నుంచి పరారవడంతో పోలీసులు అనుమానాలు బలపడ్డాయి. ఆ దిశగా విచారణ జరపడంతో భర్తే ఆమెను హత్యచేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read Also :
గొంతులు కోసే గాలిపటాలు.. లాక్‌డౌన్‌తో మళ్లీ తెరపైకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.