యాప్నగరం

అత్తకి టీ పెట్టివ్వలేదని.. కోడలి మర్మాంగాల్లో కారం పెట్టి.. దారుణం

టీ పెట్టివ్వాలని అత్త అడగడంతో పండుగపూట పొయ్యి వెలిగించకూడదని కోడలు చెప్పింది. అందుకు ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. కొడుకుని రెచ్చగొట్టి ఇద్దరూ కలిసి ఈడ్చికొట్టారు. అంతటితో ఆగకుండా..

Samayam Telugu 13 Aug 2020, 9:43 pm
అత్త కూడా ఆ ఇంటి కోడలే అన్న సంగతిని మరచిపోతున్నారు కొందరు ఆడవాళ్లు. అదనపు కట్నం తేలేదని.. చెప్పిన మాట వినలేదంటూ కుంటిసాకులతో కోడళ్లపై దారుణాలకు తెగబడుతున్నారు. కొడుకులను రెచ్చగొట్టి చిత్రహింసలకు గురిచేసే అత్తలకూ కొదువలేదు. తాజాగా అలాంటి దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. టీ పెట్టివ్వలేదన్న కోపంతో కోడలిపై రగిలిపోయిన అత్త అమానుషానికి పాల్పడింది. పండగపూట పొయ్యి వెలిగించకూడదని చెప్పినా వినిపించుకోకుండా కొడుకుతో కొట్టించి చిత్రహింసలకు గురిచేసింది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harassment


నగరంలోని సబర్మతి ఏరియాకి చెందిన వివాహిత(23) కుటుంబంతో నివాసముంటోంది. అత్త టీ పెట్టివ్వమని అడిగితే ఇప్పుడు కుదరదని చెప్పింది. ఆ రోజు షీతల్ సతం (పండుగ) కావడంతో పొయ్యి వెలిగించకూడదని.. టీ ఇవ్వలేనని చెప్పింది. షీతల్ సతం రోజు ఇంట్లో పొయ్యి వెలించకపోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆ రోజుకి అవసరమైన ఆహార పదార్థాలను ముందురోజే సిద్ధం చేసి పెట్టుకోవడం ఆనవాయితీ. అందువల్ల టీ పెట్టివ్వలేనని చెప్పింది.

కోడలి సమాధానంతో ఆగ్రహానికి గురైన అత్త గొడవకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరగడంతో కోడలిపైకి తన కొడుకుని రెచ్చగొట్టింది. ఇద్దరూ కలసి ఆమెను తీవ్రంగా కొట్టారు. అనంతరం కోడలు సమీపంలోని టీ షాపునకి వెళ్తుండగా ఆమెను జుట్టుపట్టి ఇంటికి ఈడ్చుకొచ్చి దారుణంగా చితకబాదారు. అంతటితో ఆగకుండా బట్టలు తీసేసి మర్మాంగాల్లో కారం పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న టీచర్.. ఆత్మహత్య.. విశాఖలో మిస్టరీగా మరణం

అత్తింటి వారు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీ పెట్టివ్వలేదన్న కోపంతో తన ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పెట్టి హింసించారని పేర్కొంది. కొడుకు పుట్టిన తరువాత నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయినా తిరిగి తీసుకొచ్చేవారని.. వేధింపులకు పాల్పడుతున్న అత్త, భర్తపై చర్యలు తీసుకోవాలంటూ కేసు పెట్టింది.

Read Also: బ్యాంక్ మేనేజర్‌‌కి భార్యని ఎరవేసి.. లోన్ ఇవ్వలేదని భర్త నీచం.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.