పెళ్లిపేరుతో వంచించి.. జైలుకెళ్లడం.. కేసు నుంచి బయటపడటానికి బాధితురాలని పెళ్లిచేసుకుంటానని చెప్పడం.. పెళ్లిచేసుకుని ఆమెకు చిత్రహింసలకు గురిచేయడం సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా అటువంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. భార్యతో గొడవపడిన భర్త ఆమెను కొండమీద నుంచి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నెల రోజుల తర్వాత ఘటన బయటపడింది. దీంతో నిందితుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్లోని ఉద్ధమ్ సింగ్ నగర్కు చెందిన రాజేశ్ రాయ్ అనే యువకుడు ఢిల్లీలో సేల్స్మేన్గా పనిచేస్తున్నాడు. అతడికి బబిత అనే అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే, ఆమెను పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో కేసు ఉపసంహరించుకుందని, తర్వాత పెళ్లి చేసుకున్నారని తెలిపారు. కొద్ది రోజుల్లో తన నిజస్వరూపం బయటపెట్టిన రాజేశ్.. ఆమె వేధింపులకు గురిచేశాడు. దారుణంగా కొట్టడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను బాగా చూసుకుంటానని చెప్పి పుట్టింటి నుంచి జూన్ 11న ఉత్తరాఖండ్లోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అదే రోజున ఆమెను నైనిటాల్లోని కొండపై నుంచి తోసి హత్యచేశాడు.
‘రాజేశ్ రాయ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది జూన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఆగస్టులో అరెస్ట్ చేశాం. పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో యువతి కేసును ఉపసంహరించుకుంది.. అక్టోబరులో జైలు నుంచి విడుదలయిన రాయ్.. బబిత వివాహం చేసుకున్నారు’ అని పోలీసులు తెలిపారు.
తమ కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. జూన్ 11న ఇంటి నుంచి తీసుకెళ్లాడని, ఆ రోజు నుంచి బబిత ఫోన్ స్విఛాఫ్ అయ్యిందని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే హత్యచేసినట్టు వెల్లడించాడు. ఆ రోజు తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆవేశంలో తాను కొండమీద నుంచి తోసేసినట్టు పేర్కొన్నాడు. దీంతో ఆమె మృతదేహం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే, ఆమెను పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో కేసు ఉపసంహరించుకుందని, తర్వాత పెళ్లి చేసుకున్నారని తెలిపారు. కొద్ది రోజుల్లో తన నిజస్వరూపం బయటపెట్టిన రాజేశ్.. ఆమె వేధింపులకు గురిచేశాడు. దారుణంగా కొట్టడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను బాగా చూసుకుంటానని చెప్పి పుట్టింటి నుంచి జూన్ 11న ఉత్తరాఖండ్లోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అదే రోజున ఆమెను నైనిటాల్లోని కొండపై నుంచి తోసి హత్యచేశాడు.
‘రాజేశ్ రాయ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది జూన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఆగస్టులో అరెస్ట్ చేశాం. పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో యువతి కేసును ఉపసంహరించుకుంది.. అక్టోబరులో జైలు నుంచి విడుదలయిన రాయ్.. బబిత వివాహం చేసుకున్నారు’ అని పోలీసులు తెలిపారు.
తమ కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. జూన్ 11న ఇంటి నుంచి తీసుకెళ్లాడని, ఆ రోజు నుంచి బబిత ఫోన్ స్విఛాఫ్ అయ్యిందని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే హత్యచేసినట్టు వెల్లడించాడు. ఆ రోజు తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆవేశంలో తాను కొండమీద నుంచి తోసేసినట్టు పేర్కొన్నాడు. దీంతో ఆమె మృతదేహం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.