యాప్నగరం

పబ్జీ ఆడుతుండగా ఫోన్ లాక్కున్న తల్లి.. 11వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు

నిత్యం సెల్‌ఫోన్లో గేమ్స్ ఆడుతున్న కొడుకును తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు రాత్రివేళ 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 21 Apr 2020, 12:35 pm
పబ్జీ గేమ్ మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. కొడుకు ఎప్పుడూ సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడుతూనే ఉండటంతో కోపంతో తల్లి మందలింని ఫోన్ లాక్కుంది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో సోమవారం జరిగింది. ఖానామెట్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తున్న వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారి కుమారుడు(13) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
Samayam Telugu suicide


Also Read: అమ్మాయి కోసం కక్కుర్తి... రూ.96వేలు పోగొట్టుకున్న హైదరాబాదీ

లాక్‌డౌన్ కారణంగా స్కూల్స్ మూత పడటంతో పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో బాలుడు సెల్‌ఫోన్‌లో పబ్జీ గేమ్ ఆడుతూ దానికి బానిసయ్యాడు. రోజంతా ఆ గేమ్ ఆడుతూ సరిగా తిండి కూడా తినడం లేదు. ఆదివారం రాత్రి కూడా బాలుడు భోజనం చేయకుండా గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన తల్లి కొడుకు చేతిలోని సెల్‌ఫోన్ లాక్కుని మందలించింది.

Also Read: మూడు పెళ్లిళ్లు.. ఆరుగురు సంతానం.. నాలుగో పెళ్లికి యత్నిస్తూ దారుణహత్య

దీంతో మనస్తాపానికి గురైన బాలుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో 11వ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందికి దూకేశాడు. శబ్ధం రావడంతో సెక్యూరిటీ గార్డు్లు వచ్చి చూడగా బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

Also Read: వరకట్నానికి నవవధువు బలి.. పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.