యాప్నగరం

తంజావూరులో హైదరాబాదీల అరెస్టు... దురుసుతనంతో చిక్కుల్లో పడిన దంపతులు

తంజావూరులోని బృహదీశ్వర ఆలయ సందర్శనకు వెళ్లిన దంపతులు అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సిబ్బందిపై చేయి చేసుకోవడంతో వాచ్‌మెన్ రాజ్‌కుమార్ కంటికి గాయమైంది.

Samayam Telugu 15 Jan 2020, 8:49 am
పుణ్యక్షేత్రాల సందర్శనకు తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిన తెలంగాణ దంపతులు చిక్కుల్లో పడ్డారు. తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయంలో సిబ్బందిపై దాడికి పాల్పడిన భార్యభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బృహదీశ్వర ఆలయంలో ఫిబ్రవరి 5న కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలోని రాజ మండపంలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశారు.
Samayam Telugu images (1)


Also Read: పెళ్లయి ఏడేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని.. భార్య గొంతు నులిమి

సోమవారం హైదరాబాద్‌‌లోని తిరుమలగిరికి చెందిన దంపతులు సుందర్‌శర్మ(65), మంజు(64) బృహదీశ్వర ఆలయ సందర్శనకు వచ్చారు. ప్రత్యేక కార్యాలయంలోకి వెళ్లి అక్కడున్న విగ్రహాలను ఫోటోలు తీశారు. దీన్ని గమనించిన ఆలయ జీర్ణోద్ధరణ పనుల కమిటీ అధికారి నాడిముత్తు, వాచ్‌మెన్ రాజ్‌కుమార్‌ అక్కడ ఫొటోలు తీయకూడదని వారితో చెప్పారు. దీంతో రెచ్చిపోయిన దంపతులు ఆలయ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. వాచ్‌మెన్ రాజ్‌కుమార్‌ కంటికి గాయం కావడంతో అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Also Read: రోడ్డుప్రమాదంలో యువతి మృతి.. కొద్దిరోజుల్లో డాక్టర్ కాబోతూ

ఈ ఘటనపై అందిన సమాచారంతో తంజావూరు పోలీసులు వెంటనే ఆలయానికి చేరుకుని విచారించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు వెస్ట్‌ పోలీసులు సుందర్‌శర్మ, మంజును అరెస్టు చేశారు. తెలియని ప్రాంతంలో దురుసుగా ప్రవర్తించిన ఆ దంపతులు ఇప్పుడు లబోదిబోమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read: గుంటూరు జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్.. చికిత్స పొందూతూ మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.