యాప్నగరం

రూ.4వేలకే ఐఫోన్... అడ్డంగా బుక్కయిన హైదరాబాద్ యువతి

ఓఎల్ఎక్స్‌లో రూ.6500కే ఐఫోన్ అంటూ ప్రకటన చూసిన యువతి ప్రకటన కర్తతో మాట్లాడి రూ.4వేలకే ఇవ్వాలని కోరింది. అతడు సరేనని చెప్పి పలు దఫాలుగా రూ.లక్ష వరకు కొట్టేశాడు.

Samayam Telugu 22 Mar 2020, 9:05 am
ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీ తగిలిందని, విదేశాల నుంచి గిఫ్టులు పంపిస్తున్నామంటూ ప్రజలను మభ్యపెట్టి భారీగా దోచుకుంటున్నారు. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్లలో మనీని కొట్టేస్తున్నారు. రకరకాల ఆఫర్ల పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత చెప్పినా కొందరు పట్టించుకోకుండా మోసపోతున్నారు. తాజాగా ఖరీదైన ఐఫోన్‌‌ను కేవలం రూ.4 వేలకే ఇస్తానంటూ ఓ సైబర్‌ నేరస్థుడు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతిని నమ్మించి రూ.లక్ష కొట్టేశాడు. యువతి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ దర్యాప్తు ప్రారంభించారు.
Samayam Telugu pjimage (7)


Also Read: పదేళ్ల బాలికపై అర్ధరాత్రి అఘాయిత్యం... భవనంపై నుంచి తోసి హత్య

పాతబస్తీకి చెందిన ఓ యువతి తన ఫోన్ పాడవడంతో సెకండ్ హ్యాండ్ ఫోన్ కోసం ఇటీవల ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చింది. ఈ క్రమంలోనే ఐఫోన్‌ 5ఎక్స్‌ఈ ఫోన్‌ రూ.6500కే అన్న ప్రకటనను చూసింది. ప్రకటన కర్త రావు సాహెబ్‌కు ఫోన్‌ చేయగా.. రూ.6500 పంపితే ఐఫోన్‌ పంపిస్తానని అతడు చెప్పాడు. అయితే తనకు రూ.4 వేలకే ఇవ్వాలని ఆమె కోరగా అతడు అంగీకరించాడు. దీంతో వెంటనే అతడు చెప్పిన బ్యాంక్ అకౌంట్‌కు రూ.4వేలు పంపించింది. కాసేపటికే ఫోన్ చేసి మరో రూ.2వేలు ఇస్తేనే ఫోన్ ఇస్తానని చెప్పడంతో పంపించింది.

Also Read: చిత్తూరులో కలకలం.. వ్యవసాయ బావిలో 4 శవాలు

మరోసారి ఫోన్ చేసి గూగుల్ పేలో సాంకేతిక ఇబ్బందులున్నాయని రూ.15వేలు పంపిస్తే.. తిరిగి వాటిని వెంటనే ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పాడు. ఇలా పలు దఫాలుగా ఆమె నుంచి రూ.లక్ష వరకు కొట్టేశాడు. తర్వాత అతడి ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన యువతి శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: ముఖంపై సిగరెట్లతో కాల్చి.. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ అకృత్యాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.