ఆయుర్వేద నూనెలు కొంటాం.. బహుమతులు పంపుతాం అంటూ ఫేస్బుక్ ద్వారా పరిచయం చెసుకొని మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో నివాసం ఉంటున్న లక్కీ ఓజా, జేమ్స్ ఒబాసి అనే ఇద్దరు నైజీరియన్లు అమ్మాయిల పేర్లతో ఫేస్బుక్ ఖాతాలు తెరుస్తారు. తర్వాత ప్రొఫైల్లో వైద్య నిపుణులుగా, వ్యాపారులుగా చెప్పుకుంటారు. తర్వాత హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో నివాసం ఉంటున్న వారికి ఫేసుబుక్ ఖాతాల ద్వారా అభ్యర్థనలు పంపుతారు.
స్పందించిన వారికి రోజూ సందేశాలు, తమ సమాచారాన్ని పంపేవారు. ఇలా వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న అనంతరం వ్యాపార సాయం చేస్తామని, బహుమతులు పంపుతామంటూ ప్రలోభపెడుతారు. తర్వాత వారి నుంచి రూ. లక్షల్లో కొల్లగొడతారు. ఇలాగే అంబర్పేట్కు చెందిన ఓ వ్యక్తి రూ. లక్షల్లో కొల్పోయాడు.
Also Read: హైదరాబాద్లో చంబల్ లోయ ముఠా.. పనోళ్లుగా ఇళ్లలో చేరి..
సరోలిన్ అనే యువతి పేరుతో లక్కీ ఓజా ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. లండన్లో ఉంటున్నట్లు అందులో పేర్కొన్నారు. తర్వాత అంబర్పేట్కు చెందిన యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మాటలు కలిపాడు. అనంతరం వింటోలిన్ అనే నొప్పి నివారణ నూనె భారత్లో లభిస్తుందని, దాన్ని కొని లండన్కు పంపితే లీటర్కు లక్షల్లో లాభం వస్తుందని వివరించాడు. బాధితుడు నైజీరియన్ మాటలు నమ్మి అతడు సూచించిన చిరునామాకు రూ. 97,500 పంపించి 5 సీసాల విటోలిన్ నూనె కొన్నాడు. వాటిని తీసుకొని ఢిల్లీ రావాలని కోరగా.. గతేడాది సెప్టెంబర్లో వెళ్లాడు. అక్కడ విమానాశ్రయంలో లక్కీ ఓజాను బాధితుడు కలుసుకున్నాడు.
Also Read: కొంపలు మార్చే ఈ లేడీ.. కొల్లగొట్టడంలో కిలాడీ
తర్వాత తన పేరు మార్క్ అని పరిచయం చేసుకున్నాడు. తాను లండన్ నుంచి వచ్చానని, నూనె నాణ్యతను పరిశీలిస్తామని చెప్పాడు. రెండు రోజుల తర్వాత సరోలిన్ పేరుతో ఫొన్ చేశాడు. తనకు 40 బాటిళ్ల నూనె కావాలని తెలిపాడు. లక్షల్లో లాభం వస్తుందన్న ఆశతో విటోలిన్ నూనె కంపెనీ ఖాతాలో రూ. 6,82,500 లక్షలు జమ చేశాడు. తర్వాత సీసాలు ఎప్పడు వస్తాయని ఫోన్ చేయగా స్విచాఫ్ అని సమాధానం వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీకి వెళ్లి లక్కీ ఓజాకు సహకరించిన దీపక్ను 3 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అలాగే సోమవారం రాత్రి లక్కీ ఓజాను అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు.
Also Read: హైదరాబాద్లో ‘శ్మశాన’ నిశ్శబ్దం.. ఉరిని ముద్దాడిన ఆరుగురు
స్పందించిన వారికి రోజూ సందేశాలు, తమ సమాచారాన్ని పంపేవారు. ఇలా వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న అనంతరం వ్యాపార సాయం చేస్తామని, బహుమతులు పంపుతామంటూ ప్రలోభపెడుతారు. తర్వాత వారి నుంచి రూ. లక్షల్లో కొల్లగొడతారు. ఇలాగే అంబర్పేట్కు చెందిన ఓ వ్యక్తి రూ. లక్షల్లో కొల్పోయాడు.
Also Read: హైదరాబాద్లో చంబల్ లోయ ముఠా.. పనోళ్లుగా ఇళ్లలో చేరి..
సరోలిన్ అనే యువతి పేరుతో లక్కీ ఓజా ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. లండన్లో ఉంటున్నట్లు అందులో పేర్కొన్నారు. తర్వాత అంబర్పేట్కు చెందిన యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మాటలు కలిపాడు. అనంతరం వింటోలిన్ అనే నొప్పి నివారణ నూనె భారత్లో లభిస్తుందని, దాన్ని కొని లండన్కు పంపితే లీటర్కు లక్షల్లో లాభం వస్తుందని వివరించాడు. బాధితుడు నైజీరియన్ మాటలు నమ్మి అతడు సూచించిన చిరునామాకు రూ. 97,500 పంపించి 5 సీసాల విటోలిన్ నూనె కొన్నాడు. వాటిని తీసుకొని ఢిల్లీ రావాలని కోరగా.. గతేడాది సెప్టెంబర్లో వెళ్లాడు. అక్కడ విమానాశ్రయంలో లక్కీ ఓజాను బాధితుడు కలుసుకున్నాడు.
Also Read: కొంపలు మార్చే ఈ లేడీ.. కొల్లగొట్టడంలో కిలాడీ
తర్వాత తన పేరు మార్క్ అని పరిచయం చేసుకున్నాడు. తాను లండన్ నుంచి వచ్చానని, నూనె నాణ్యతను పరిశీలిస్తామని చెప్పాడు. రెండు రోజుల తర్వాత సరోలిన్ పేరుతో ఫొన్ చేశాడు. తనకు 40 బాటిళ్ల నూనె కావాలని తెలిపాడు. లక్షల్లో లాభం వస్తుందన్న ఆశతో విటోలిన్ నూనె కంపెనీ ఖాతాలో రూ. 6,82,500 లక్షలు జమ చేశాడు. తర్వాత సీసాలు ఎప్పడు వస్తాయని ఫోన్ చేయగా స్విచాఫ్ అని సమాధానం వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీకి వెళ్లి లక్కీ ఓజాకు సహకరించిన దీపక్ను 3 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అలాగే సోమవారం రాత్రి లక్కీ ఓజాను అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు.
Also Read: హైదరాబాద్లో ‘శ్మశాన’ నిశ్శబ్దం.. ఉరిని ముద్దాడిన ఆరుగురు