యాప్నగరం

అసలు మనుషులేనా? నా మదర్, ఫాదర్ చచ్చిపోయారు.. అవంతి ఆగ్రహం

అసలు మనుషులేనా అనేలా ప్రవర్తించారు. నా మదర్ గానీ, మదర్ గానీ.. నా వాళ్లందరూ చచ్చిపోయారు. వాళ్ల గురించి మాట్లాడాలని కూడా అనుకోవడం లేదని అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 25 Sep 2020, 12:57 pm
హైదరాబాద్ హేమంత్ హత్య కేసు సంచలనంగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు కూతురి భర్తని తండ్రి కిరాతకంగా హత్య చేయించడం కలకలం రేపింది. పెళ్లై నాలుగు నెలలు తిరక్కుండానే భర్తని కోల్పోయిన అవంతి శోకసంద్రంలో మునిగిపోయింది. తన భర్తని ఈడ్చుకెళ్లి అత్యంత కిరాతకంగా హత్య చేశారని వాపోయింది. తన బంధువులే కదా తీసుకెళ్లి మాట్లాడతారని అనుకున్నానని.. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ కొట్టినా అయినవాళ్లే కదా అని సరిపెట్టుకుందామని అనుకున్నానని.. కానీ తన భర్తని తనకు కాకుండా చేశారని కన్నీరుపెట్టుకుంది.
Samayam Telugu హత్యకు గురైన హేమంత్
murder


అమానుషంగా ప్రవర్తించిన తన తల్లిదండ్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అవంతి. నా మదర్, ఫాదర్ చచ్చిపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు మనుషులేనా అనిపించేలా ప్రవర్తించారని.. అసలు వాళ్ల గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవితంలో తన తల్లిదండ్రులను కలిసే పరిస్థితే లేదని.. తన భర్త వెళ్లిపోతూ అత్తమామలను చూసుకోవాల్సిన బాధ్యత ఇచ్చి వెళ్లాడని ఆమె పేర్కొంది. తన భర్త హత్యకు కారణమైన తల్లిదండ్రులు, బంధువుల, మామయ్యలు అందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. తన అత్తమామలను చూసుకుంటానని ఆమె తెలిపింది.

Also Read: హైదరాబాద్‌లో మరో మారుతీరావు.. కూతురి భర్తని అంతమొందించిన తండ్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.