యాప్నగరం

ప్రేమించాలంటూ బాలికకు వేధింపులు.. పోకిరీకి దేహశుద్ధి

ప్రేమిస్తున్నానంటూ సాయిప్రసాద్ కొద్దిరోజులుగా బాలికను వేధిస్తున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో అసభ్య పదజాలంతో తిడుతున్నాడు. దీంతో ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు, టీచర్లకు చెప్పింది.

Samayam Telugu 19 Nov 2019, 11:37 am
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న పోకిరీని కుటుంబసభ్యులు, స్థానికులు పట్టుకుని చితక్కొట్టిన ఘటన హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో సోమవారం జరిగింది. మల్కాజ్‌గిరిలోని ఓ కాలనీలో నివాసముండే బాలిక(13) స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె రోజూ స్కూల్‌కి వెళ్లివచ్చే సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి సాయిప్రసాద్(35) లైంగికంగా వేధిస్తున్నాడు.
Samayam Telugu woman


Also Read: హైదరాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

ప్రేమిస్తున్నానని, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానంటూ బాలికను వేధిస్తున్నాడు. దీనికి బాలిక అంగీకరించకపోవడంతో కొద్దిరోజులుగా ఆమెను అసభ్య పదజాలంతో తిడుతున్నాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులు, స్కూల్ యాజమాన్యానికి చెప్పింది. దీంతో వారంతా సోమవారం బాలిక స్కూల్‌కి బయలుదేరిన సమయంలో నిఘా పెట్టారు. ఆమె రాకను గమనించిన సాయిప్రసాద్ బాలికను అడ్డగించి వేధించాడు.

Also Read: రూ.3లక్షల అప్పుకు రూ.8లక్షల వసూలు.. అయినా కోరిక తీర్చాలంటూ మహిళకు వేధింపులు

వెంటనే కుటుంబసభ్యులు, స్కూల్ టీచర్లు, స్థానికులు అక్కడికి చేరుకుని సాయిప్రసాద్‌కు దేహశుద్ధి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: పక్కింటి యువకుడితో ప్రేమ.. కూతురికి కరెంట్ షాకిచ్చి గొంతుకోసి దారుణహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.