యాప్నగరం

భార్య టీ ఇవ్వలేదని అలిగి భర్త ఆత్మహత్య

తాను ఇంటి పనిలో బిజీగా ఉన్నానని, కాసేపు ఆగాలని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆవేశానికి గురైన ఆడివయ్య భార్యతో గొడవపడ్డాడు. జ్యోతి కూడా ఎదురుతిరగడంతో మనస్తాపానికి గురై సమీపంలో ఉన్న క్వారీ గుంతలో దూకేశాడు.

Samayam Telugu 18 Nov 2019, 2:04 pm
సంసారంలో చికాకులు, మనస్పర్థలు సాధారణమే. అవన్నీ దాటుకుని కొనసాగితేనే కాపురం పదికాలాల పాటు పచ్చగా ఉంటుంది. కానీ నేటి కాలంలో భార్యభర్తలు చిన్నపాటి కారణాలకే మనస్తాపానికి గురై నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో భార్య టీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.
Samayam Telugu pjimage (8)


Also Read: మీర్‌పేటలో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్.. నిందితుడిని చూసి పోలీసులు షాక్

జగద్గిరిగుట్ట బాలయ్యనగర్‌లో ఆడివయ్య(35) అనే వ్యక్తి భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆటోడ్రైవర్ అయిన ఆడివయ్య ఆదివారం ఉదయం బయటకు వెళ్తూ టీ ఇవ్వాలని భార్యను అడిగాడు. తాను ఇంటి పనిలో బిజీగా ఉన్నానని, కాసేపు ఆగాలని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆవేశానికి గురైన ఆడివయ్య భార్యతో గొడవపడ్డాడు. జ్యోతి కూడా ఎదురుతిరగడంతో మనస్తాపానికి గురై సమీపంలో ఉన్న క్వారీ గుంతలో దూకేశాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. గుంతలో నీరు నిండుగా ఉండటంతో కొద్ది నిమిషాల్లోనే ఆడివయ్య ఊపిరాడక చనిపోయాడు.

Also Read: పెళ్లయిన వారానికే భర్తకు విషం పెట్టిన నవవధువు... కర్నూలులో దారుణం

కొద్ది నిమిషాల ముందు వరకు తనతో గొడవపడిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న జ్యోతి పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుని రోదించింది. టీ ఇవ్వలేదన్న చిన్న కారణంతోనే ఆత్మహత్య చేసుకుని తన జీవితానికి దిక్కు లేకుండా చేసేశాడని జ్యోతి విలపించిన తీరు అందరినీ కలచివేసింది.

Also Read: స్నేహితుల అరాచకం.. మత్తు మందిచ్చి వివాహితపై గ్యాంగ్ రేప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.