యాప్నగరం

Hyderabad: రెండు రోజుల్లో చెల్లి పెళ్లి.. కరెంట్‌ షాక్‌తో అన్న మృతి

ఈ నెల ఐదో తేదీన చెల్లి పెళ్లి కావడంతో గణేష్ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం కరెంట్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 3 Aug 2020, 8:30 am
మరో రెండ్రోజుల్లో చెల్లి పెళ్లి జరగాల్సిన ఇంటి అన్న మరణం తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. తురాబ్‌నగర్‌కు చెందిన గణేశ్‌ (34)కు భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామంతాపూర్‌లోని ఐడియా సంస్థ కార్యాలయంలో హౌస్‌ కీపర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల ఐదో తేదీన అతడి చెల్లి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Samayam Telugu Image


Also Read: ఒక హత్యకు ప్రతీకారంగా రెండు హత్యలు.. నల్గొండ జిల్లాలో దారుణం

ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున మోటారు తీగలను ప్లగ్‌లో పెడుతుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే 108 వాహనంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తరలించారు. గణేశ్‌‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. కూతురి పెళ్లి జరుగుతుందన్న ఆనందంతో మునిగితేలుతున్న ఆ తల్లిదండ్రులు కొడుకు మరణంతో షాక్‌లోకి వెళ్లిపోయారు. తనకు, పిల్లలకు ఇంక దిక్కెవంటూ అతడి భార్య రేణుక విలపిస్తు్న్న తీరు స్థానికులు, బంధువులను కన్నీరు పెట్టించింది. ఈ ఘటనపై అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఆన్‌లైన్‌ గేమ్‌లో రూ.7లక్షలు నష్టం.. హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.