యాప్నగరం

అమెరికా వీసా పేరుతో రూ.7.40 లక్షలు స్వాహా.. అడ్డంగా బుక్కైన హైదరాబాదీ

అమెరికా వీసా ఇప్పిస్తానని యువకుడిని నమ్మించిన నరేష్‌కుమార్ అతడి నుంచి ఏకంగా రూ.7.40 లక్షలు దోచుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 4 Aug 2020, 2:52 pm
కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాలకే వెళ్లడం కష్టంగా మారితే.. కొందరు దుండుగులు ఏకంగా అమెరికా వెళ్లేందుకు వీసా ఇప్పిస్తామని నమ్మబలికి రూ.లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో వెలుగుచూసింది. నరేంద్ర అనే వ్యక్తి ఇటీవల బేగంపేటలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించాడు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సులభంగా వీసాలు ఇప్పిస్తానంటూ ప్రకటనలు గుప్పించాడు.
Samayam Telugu Image


Also Read: బాలిక హత్యాచారం కేసులో మరణశిక్ష.. విజయవాడ కోర్టు సంచలన తీర్పు

ఆ ప్రకటన చూసిన అమీర్‌పేటకు చెందిన కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి నరేంద్రను సంప్రదించాడు. అమెరికా వెళ్లడానికి తనకు వీసా ఇప్పించాలని కోరాడు. దాని కోసం విడతల వారీగా రూ.7.40లక్షలు కట్టించుకున్న నరేంద్ర అతడిని కొద్దిరోజులు తిప్పించుకున్నాడు. ఎన్ని రోజులైనా వీసా రాకపోవడంతో అనుమానం వచ్చిన కిరణ్‌కుమార్ అతడిని నిలదీయగా అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితుడు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేంద్ర ప్రస్తుతం పుణెలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: అనంతపురం: వివాహితకు ప్రేమలేఖ ఇచ్చిన గ్రామవాలంటీర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.