యాప్నగరం

పాతబస్తీలో ఘోరం.. నలుగురికి నరికిన యువకుడు.. ముగ్గురు స్పాట్‌లోనే..

పాతబస్తీలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఓ యువకుడు నలుగురిని కత్తులతో నరికాడు.

Samayam Telugu 29 Jun 2020, 10:43 pm
హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. చాంద్రాయణగుట్ట బార్కస్‌లో నలుగురిపై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే... కుటుంబ కలహాలతో అహ్మద్‌ బా ఇస్మాయిల్‌ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సొంత అక్కచెల్లెళ్లనే దారుణంగా నరికి చంపాడు. ఇస్మాయిల్‌ గతేడాది భార్యను హత్య చేసిన కేసులో అరెస్ట్‌ కాగా, ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు.
Samayam Telugu ఘటనా స్థలంలో వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు


అప్పటి నుంచి కుటుంబసభ్యుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో సోమవారం సాయంత్రం అమ్మద్ రజియానా, జగ్గీరా, ఉమర్ భా హసన్, నూరా బేగంపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట పోలీసులు, సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న అహ్మద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు బృందాలతో పాటు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.