డేటింగ్ యాప్లో యువతులను పరిచయం చేసుకుని వారిని వేధిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డాక్టర్గా పరిచయం చేసుకున్న నిందితుడు తనతో చాటింగ్ చేసిన మహిళలు, యువతులను మభ్యపెట్టి వ్యక్తిగత చిత్రాలు సేకరించడం, తర్వాత వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో నగదు గుంజుతున్నాడని పోలీసులు తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వాడి ఆట కట్టించారు.
కర్నూలులోని లక్ష్మీనగర్కు చెందిన గొల్లాలదొడ్డి అబ్దుల్లా(35) కొద్దికాలం క్రితం హైదరాబాద్కు వచ్చి కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. తన పేరును డా.కార్తిక్రెడ్డి అంటూ ఓ డేటింగ్ యాప్లో నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట నగరానికి చెందిన ఓ యువతి ఆ యాప్లో పరిచయమైంది. అప్పట్లో ఎంబీబీఎస్ చదువుతున్న ఆమెతో అబ్దుల్లా తరచూ చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం పెరగడంతో తరచూ కలుసుకునేవారు. ఆ సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలను అబ్దుల్లా తనవద్ద దాచుకున్నాడు.
కొంతకాలం తర్వాత ఆ యువతికి పెళ్లి జరగడంతో చాటింగ్ మానేయాలని కోరింది. ఇందుకు నిరాకరించిన అబ్దుల్లా తనకు డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించాడు. సోషల్మీడియాలో పోస్టు చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో విడతల వారీగా ఆమె నుంచి సుమారు రూ.4లక్షల వరకు దోచుకున్నాడు. తర్వాత కూడా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు మార్చి 23న హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయిచింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
అబ్దుల్లా ఇదే విధంగా మరో ఏడుగురితోనూ చాటింగ్ చేసి వారి వ్యక్తిగత ఫోటోలు దాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే తాను వారిని డబ్బు కోసం వేధించలేదని నిందితుడు చెబుతున్నాడు. అతడు చాటింగ్ చేసిన మహిళలను పోలీసులు సంప్రదించగా ఫిర్యాదు వారు ముందుకు రానట్లు తెలుస్తోంది. ఈ విషయం కుటుంబాల్లో తెలిస్తే పరువు పోతుందని, దయచేసి తమను వదిలేయాలని ఆ మహిళలు పోలీసులను వేడుకున్నట్లు సమాచారం.
కర్నూలులోని లక్ష్మీనగర్కు చెందిన గొల్లాలదొడ్డి అబ్దుల్లా(35) కొద్దికాలం క్రితం హైదరాబాద్కు వచ్చి కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. తన పేరును డా.కార్తిక్రెడ్డి అంటూ ఓ డేటింగ్ యాప్లో నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట నగరానికి చెందిన ఓ యువతి ఆ యాప్లో పరిచయమైంది. అప్పట్లో ఎంబీబీఎస్ చదువుతున్న ఆమెతో అబ్దుల్లా తరచూ చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం పెరగడంతో తరచూ కలుసుకునేవారు. ఆ సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలను అబ్దుల్లా తనవద్ద దాచుకున్నాడు.
కొంతకాలం తర్వాత ఆ యువతికి పెళ్లి జరగడంతో చాటింగ్ మానేయాలని కోరింది. ఇందుకు నిరాకరించిన అబ్దుల్లా తనకు డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించాడు. సోషల్మీడియాలో పోస్టు చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో విడతల వారీగా ఆమె నుంచి సుమారు రూ.4లక్షల వరకు దోచుకున్నాడు. తర్వాత కూడా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు మార్చి 23న హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయిచింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
అబ్దుల్లా ఇదే విధంగా మరో ఏడుగురితోనూ చాటింగ్ చేసి వారి వ్యక్తిగత ఫోటోలు దాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే తాను వారిని డబ్బు కోసం వేధించలేదని నిందితుడు చెబుతున్నాడు. అతడు చాటింగ్ చేసిన మహిళలను పోలీసులు సంప్రదించగా ఫిర్యాదు వారు ముందుకు రానట్లు తెలుస్తోంది. ఈ విషయం కుటుంబాల్లో తెలిస్తే పరువు పోతుందని, దయచేసి తమను వదిలేయాలని ఆ మహిళలు పోలీసులను వేడుకున్నట్లు సమాచారం.