యాప్నగరం

ఆధ్యాత్మిక ముసుగులో రూ. లక్షల్లో స్వాహా..

ఆధ్యాత్మిక బోధనల ముసుగులో మోసాలకు పాల్పడే మరో మాయగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళకు ఆధ్యాత్మిక బోధనల మాయలో పడేసి ఆమె నుంచి ఏటీఎం కార్డును తీసుకెళ్లి రూ. లక్షల్లో డ్రా చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Samayam Telugu 18 Dec 2019, 6:47 pm
నమ్మేవారు ఉన్నంత కాలం.. బురిడీ కొట్టించే వారు పుట్టుకొస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక బోధనల ముసుగులో మోసాలకు పాల్పడే మరో మాయగాడు సాక్ష్యాత్కారమయ్యాడు. ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఏకంగా ఆమె ఏటీఎం తీసుకున్న బురిడీ బాబా.. ఆమెకు చెప్పకుండా రూ. లక్షలు డ్రా చేసుకున్నాడు. చివరికి ఆ మాయగాడు పోలీసులకు పట్టుబడ్డాడు.
Samayam Telugu fake baba


నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన గిరీష్ కుమార్ హైదరాబాద్‌లోని మధురానగర్‌లో నివాసముంటూ ఆధ్యాత్మిక బోధనల పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా మహిళలకు ఇతిహాసాలు, దేవుళ్ల పేరుతో బోధనలు చేసి వారి నుంచి అందినకాడికి దోచుకుంటాడు. ఇదే తరహాలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ మహిళకు ఆధ్యాత్మిక బోధనల మాయలో పడేసి ఆమె నుంచి ఏటీఎం కార్డును తీసుకెళ్లాడు.

Also Read: రూ. 7 లక్షలు కాపాడుకోవడానికి.. రూ. 49 లక్షలు ‘సమర్పయామి’.. రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు

మొదట ఏటీఎం నుంచి లక్ష రూపాయలు డ్రా చేశాడు. ఇది గుర్తించిన మహిళ ఏటీఎం కార్డును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే కార్డు తిరిగి ఇవ్వకపోగా మరో రూ. 2.70 లక్షలు డ్రా చేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధిత మహిళ.. పోలీసులను ఆశ్రయించింది.

ఈ క్రమంలో బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న కుమార్‌ను గుర్తించిన పోలీసులు వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. కుమార్‌ తాను చేసిన మోసాల చిట్టా విప్పాడు.

Also Read: రూ. 9 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

కుమార్‌పై మీర్‌పేట్, మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌‌లతో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సైతం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మోసాలకు పాల్పడుతున్న కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు. కుమార్ బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కేసు తీవ్రతను బట్టి అతనిపై పీడీ యాక్ట్‌ను కూడా అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

Also Read: సికింద్రాబాద్‌లో పట్టపగలే భారీ చోరీ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.