యాప్నగరం

టిప్పర్‌ కింద నలిగిపోయిన యువకుడు.. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో

కొడుక్కి ఉద్యోగం రావడంతో తన కష్టాలు తీరతాయని అనుకుంటున్న సమయంలో అనిల్ రోడ్డుప్రమాదంలో చనిపోయాడని తెలిసి షాక్‌లోకి వెళ్లిపోయింది.

Samayam Telugu 20 Dec 2019, 11:59 am
హైదరాబాద్‌లో మరో రోడ్డుప్రమాదం తీవ్ర విషాదం నింపింది. బహదూర్‌పల్లిలోని బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అనిల్ కుమార్ డిగ్రీ పూర్తిచేసి షాపూర్‌లో నివాసముంటున్నాడు. ఇటీవలే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సాధించాడు. గురువారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు.
Samayam Telugu లడడుదా


Also Read: బంజారాహిల్స్‌ హోటల్‌లో వ్యభిచారం.. బాలీవుడ్ నటి సహా ముగ్గురి అరెస్ట్

అనిల్‌కుమార్ బహదూర్‌పల్లి మీదుగా వెళ్తున్న సమయంలో ఓ టిప్పర్ వేగంగా వెనుక నుంచి అతడిని ఢీకొట్టింది. దీంతో అనిల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని సూరారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు అనిల్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

Also Read: మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి.. పరిస్థితి విషయం

తల్లికి, తోబుట్టువులకు అండగా ఉంటాడనుకుంటే..
అనిల్‌కుమార్ తండ్రి 15ఏళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో తల్లే అతడితో పాటు ముగ్గురు కుమార్తెలను పెంచి పోషించింది. కొడుక్కి ఉద్యోగం రావడంతో తన కష్టాలు తీరతాయని అనుకుంటున్న సమయంలో అనిల్ రోడ్డుప్రమాదంలో చనిపోయాడని తెలిసి షాక్‌లోకి వెళ్లిపోయింది. చేతికి అంది వచ్చిన కొడుకును టిప్పర్ రూపంలో మృత్యువు కబళించడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. తనతో పాటు ముగ్గురు ఆడపిల్లలు అండగా ఉంటాడని భావిస్తున్న తరుణంలో అనిల్ చనిపోవడంతో ఆ కుటుంబంతో తీవ్ర విషాదం నింపింది. అనిల్ తల్లి, తోబుట్టువులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.

Also Read: హైదరాబాద్‌లో యువతి అదృశ్యం... ప్రియుడి కోసం వెళ్తున్నానంటూ లేఖ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.