యాప్నగరం

భారతీయ జంటను చంపేసిన పాకిస్తానీ.. దారుణం

పాకిస్తానీ చేతిలో భారతీయ జంట దారుణ హత్యకు గురైంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు డబ్బు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 23 Jun 2020, 10:44 pm
భారతీయ దంపతులను పాకిస్తానీ దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇండియాకు చెందిన భార్యాభర్తలు హిరెన్ ఆదియా, విధి ఆదియా దుబాయ్‌లో స్థిరపడ్డారు. అరేబియన్ రాంచెస్‌లో నివాసముంటున్న హిరెన్.. షార్జాలో వ్యాపారం చేసేవాడు. హిరెన్ కదలికలపై కన్నేసిన పాకిస్తానీ డబ్బు, బంగారం దోచుకుని హిరెన్ దంపతులను కిరాతకంగా చంపేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


ఈ నెల 18న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బు, నగల కోసమే హత్యలకు తెగబడినట్లు తెలుస్తోంది. నిందితుడైన పాకిస్తానీయుడిని దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి సొమ్ము రికవరీ చేశారు. దంపతుల హత్య విషయాన్ని దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌కి తెలియజేశారు. హిరెన్ దంపతులు ఎక్కడి వారన్నది తెలియలేదు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: స్నేహితుడి భార్యపై కామం.. కోర్టు ఆవరణలోనే గదిలోకి తీసుకెళ్లి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.