యాప్నగరం

పీపీఈ కిట్ తొలగించి కరోనా రోగితో నర్సు కామక్రీడలు

ఇండోనేషియా రాజధాని జకార్తాలోని కోవిడ్ సెంటర్లో పనిచేస్తున్న నర్సు నీచానికి పాల్పడింది. కరోనా రోగిని రెచ్చగొట్టి అతడితో శృంగారంలో పాల్గొంది. దీంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.

Samayam Telugu 5 Jan 2021, 10:41 am
ఇండోనేషియా రాజధాని జకార్తాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కరోనా వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు కామంతో కళ్లు మూసుకుపోయిన కరోనా రోగితోనే శృంగారంలో పాల్గొంది. జకార్తాలోని విస్మా అట్లెట్ క్వారంటైన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు పీపీఈ కిట్ తొలగించి.. తన అందచందాలతో కరోనా పేషెంట్‌ని రెచ్చగొట్టి బాత్‌రూమ్‌లో అతడితో కామకలాపాలు జరిపింది.
Samayam Telugu Image


Also Read: బావిలో శవమై తేలిన యువకుడు.. హత్యే అంటున్న ఫ్యామిలీ.. వెలుగులోకి ప్రేమ వ్యవహారం

ఈ విషయాన్ని సదరు కరోనా పేషెంటే స్వయంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ దారుణం బయటపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించి క్వారంటైన్లో ఉంచారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు నర్సును అధికారులు సస్పెండ్ చేశారు. నర్సుతో పాటు కరోనా రోగిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నర్సుకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Also Read: ఆన్‌లైన్ ‌లోన్ స్కామ్‌... రూ.21వేల కోట్లు కొల్లగొట్టిన చైనా ముఠా.. వెలుగులోకి సంచలన నిజాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.