యాప్నగరం

ఇంటర్ విద్యార్థిని అఘాయిత్యం.. గుంటూరులో విషాదం

ఇంటర్ చదువుతున్న స్నేహలత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేసింది. పరీక్షల్లో ఫెయిల్ అవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 14 Jun 2020, 2:53 pm
గుంటూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌లో ఫెయిలవడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన భీమవరపు సైదారావు కుమార్తె స్నేహలత ఇంటర్ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఆమె ఫెయిలైంది.
Samayam Telugu ఆత్మహత్య చేసుకున్న స్నేహలత
suicide


పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మనస్థాపానికి గురైన స్నేహలత బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేసింది. కొద్దిసేపటికే ఆమె మరణించింది. విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పరీక్షల్లో ఫెయిలైనందుకు ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పోర్న్‌సైట్‌లో ప్రియురాలి నగ్న చిత్రాలు, వీడియోలు.. ప్రియుడి నీచం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.