యాప్నగరం

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. నార్సింగిలో విషాదం

నార్సింగిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాలలోనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 26 Feb 2020, 10:36 pm
ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల హాస్టల్‌లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu death3


అయితే ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు నగరంలో కలకలం రేపుతున్నాయి. పటాన్‌చెరువు సమీపంలోని వెలిమేల గ్రామంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సంధ్యారాణి నిన్న ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.

Also Read: కొడుకుల ముందు డ్రెస్ తీసేసిన సవతి తల్లి.. అసభ్యంగా రెచ్చగొడుతోందంటూ..

బాత్‌రూమ్‌లోకి వెళ్లిన సంధ్యారాణి అక్కడే ఉరేసుకొని చనిపోయింది. కాలేజీ సిబ్బంది ఆమెను నలగండ్లలోని సిటిజన్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తల్లిండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పత్రి వద్దకు వచ్చారు. కుమార్తె మరణవార్త విని బోరున విలపించారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

Read Also: తమలపాకు కోసం అత్త దగ్గరికి.. మెల్లిగా కోడలితో ఎఫైర్.. బెడ్రూమ్‌లో దొరికిపోవడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.