యాప్నగరం

ఇంటర్ ఫెయిల్ కావడంతో బాలిక ఆత్మహత్య.. శ్రీకాకుళంలో విషాదం

ఇంటర్ సెకండియర్‌లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో స్వర్ణలత మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 14 Jun 2020, 12:08 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలు ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఇంటర్ సెకండియర్ ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునింది. ఒక్కగానొక్క కూతురని అల్లారుముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన దూశి లక్ష్మణరావు, సరోజిని దంపతుల ఏకైక కుమార్తె స్వర్ణలత (17) ఇటీవలే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. అప్పటినుంచి మనస్తాపంతో ఉంటున్న కూతురిని తల్లిదండ్రులు సముదాయిస్తూ వచ్చారు.
Samayam Telugu తల్లిదండ్రులతో స్వర్ణలత


Also Read: ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి.. అవమానం తట్టుకోలేక ఇద్దరు కొడుకుల ఆత్మహత్య

శనివారం వ్యవసాయ పనుల నిమిత్తం తల్లిదండ్రులు మరో గ్రామానికి వెళ్లడంతో స్వర్ణలత ఒంటరిగా ఉంది. దీంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఆమె ఎత్తకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో తల్లి వెంటనే ఇంటికి వెళ్లి చూడగా స్వర్ణలత ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

Also Read: నగ్నంగా కనిపించాలంటూ యువతికి వేధింపులు.. నీచానికి పాల్పడిన ఫ్రెండ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.