యాప్నగరం

శ్రీకాకుళం జిల్లాలోకి పాక్ ఉగ్రవాది చొరబాటు?.. జల్లెడ పడుతున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లాలోకి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐకి చెందిన ఉగ్రవాది చొరబడినట్లు తెలుస్తోంది. సముద్ర మార్గం ద్వారా ఇచ్ఛాపురం వద్ద ఉగ్రవాది భారత భూభాగంలోకి అడుగుపెట్టినట్లు నిఘా వర్గాల సమాచారం

Samayam Telugu 13 Jan 2020, 11:28 am
సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్న వేళ శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాది ఒకడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు వర్తమానం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. సరిహద్దులతో పాటు చెక్‌పోస్టుల వద్ద నిఘా ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వదిలిపెడుతున్నారు. కొత్తవ్యక్తులు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Samayam Telugu terrosits


Also Read: హెచ్‌ఓడీతో రాసలీలల వీడియో లీక్.. హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

పండుగ వేళ అలజడులు సృష్టించాలన్న లక్ష్యంతో ఉగ్రవాదులు శ్రీకాకుళం జిల్లాను టార్గెట్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాది సముద్ర మార్గంలో వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. అయితే ఇది నిఘా వర్గాల నుంచి కచ్చితంగా వచ్చిన సమాచారమా? లేక వదంతులా? అన్న దానిపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు.

Also Read: జూనియర్ ఆర్టిస్ట్ కళ్యాణి ఆత్మహత్య.. భర్తే చంపాడంటున్న తల్లిదండ్రులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.