యాప్నగరం

యోగా గురువుల కీచకపర్వం.. జపనీస్ శిష్యురాలితో అసభ్యకరంగా..

యోగా నేర్చుకునేందుకు ఇండియా వచ్చిన జపనీస్ మహిళపై కన్నేసిన యోగా గురువులు దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశారు.

Samayam Telugu 12 May 2020, 3:45 pm
మహిళను చూస్తే కామంతో రగిలిపోతున్నారు కొందరు కామాంధులు. ఉచ్ఛం నీచం మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. యోగాభ్యసనకు ఇండియా ఓ జపాన్ మహిళపై ఏకంగా యోగా గురువులే వేధింపులకు పాల్పడిన దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా ఉన్న సమయంలో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


యోగా నేర్చుకునేందుకు ఇండియా వచ్చిన ఓ జపనీస్ మహిళ(27)ను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన రిషికేష్‌లో చోటుచేసుకుంది. యోగాభ్యసన కోసం జపనీస్ మహిళ ఓ యోగా స్కూల్‌లో చేరింది. అందులో పనిచేస్తున్న యోగా గురువులు ఆమెపై కన్నేశారు. ఇద్దరు గురువులు.. స్కూల్‌ సిబ్బంది ఒకరు కలసి జపనీస్ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేశారు.

Also Read: భర్తను చంపేసి హైడ్రామా.. నాగర్ కర్నూల్‌లో దారుణం

అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆమె రిషికేష్ పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యోగా గురువులతో పాటు ఒక వంటమనిషి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యోగా గురువులు చంద్రకాంత్(32), హరికిషన్‌(43), వంటమనిషి సోమరాజ్(23)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.