యాప్నగరం

భర్త కళ్లెదుటే ఘోరం.. భార్యపై 17 మంది.. దారుణం

వారాంతపు సంతకు వెళ్లొస్తున్న దంపతులను కొందరు దుండగులు అడ్డుకున్నారు. భర్తని నిర్బంధించి అమానుష చర్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది.

Samayam Telugu 10 Dec 2020, 10:15 am
మహిళల రక్షణకు కఠిన చట్టాలు చేసినా.. న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తున్నా కామకీచకుల్లో కనీస భయం కలగడం లేదు. దేశంలో నిత్యం అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నావ్, దిశ, హత్రాస్ ఘటనలు మరువక ముందే దేశం దిగ్భ్రాంతికి గురయ్యే మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్త కళ్లెదుటే భార్యపై 17 మంది సామూహిక అత్యాచారం చేసిన అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape


దుమ్కా జిల్లాకి చెందిన మహిళ(35) తన భర్తతో కలసి వారాంతపు సంతకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు వారిని అడ్డగించారు. భర్తను నిర్బంధించి అతని ఎదుటే భార్యపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అభాగ్యురాలిపై 17 మంది అత్యాచారం చేశారు. ముఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలికి ఐదుగురు పిల్లలున్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని బాధితురాలు గుర్తుపట్టడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు డీఐజీ సుదర్శన్ మండల్, దుమ్కా ఎస్పీ అంబర్ లక్రా తెలిపారు.

Also Read: బైక్‌పై నుంచి పడిన యువతి, హెయిర్ క్లిప్ గుచ్చుకుని.. తిరుపతిలో షాకింగ్ ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.