యాప్నగరం

జర్నలిస్టు హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష

సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పు వెలువరించింది. 2018 అక్టోబరు 2న టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆయన్ను సౌదీ ఏజెంట్లు హత్య చేశారు.

Samayam Telugu 24 Dec 2019, 11:12 am
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే మరో ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వాషింగ్టన్‌ పోస్ట్‌ కాలమిస్టుగా పనిచేసిన జమాల్‌ ఖషోగీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సౌదీ రాచరిక ప్రభుత్వపు నియంతృత్వ విధానాలపై ఖషోగీ తరచూ విమర్శలు చేస్తుండే వారు.
Samayam Telugu Jamal-Khashoggi


ఈ నేపథ్యంలో 2018 అక్టోబరు 2న టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వచ్చారు. దీంతో ఆయనను అక్కడే సౌదీ ఏజెంట్లు దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై దర్యాప్తు చేపట్టిన సౌదీ ప్రభుత్వం 11 మందిని విచారించింది.

Also Read: గల్ఫ్ ఏజెంట్.. ఘరానా మోసం

అయితే ఖషోగీ హత్యలో సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉన్నట్లు తొలుత ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై పలువురు జర్నలిస్టులు నేరుగా సల్మాన్‌నే ప్రశ్నించారు. అయతే ఈ వాదనలను సల్మాన్‌ ఖండించారు. ఖషోగీ హత్యలో తన ప్రమేయం లేదని చెప్పారు. అయితే తన హయాంలో ఈ ఘోరం జరిగింది కాబట్టి ఇందుకు తనదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ కేసుపై విచారణ జరిపి ఐదుగురికి మరణశిక్ష విధించింది.

Also Read: తిరుపతి రౌడీషీటర్ మురళి హత్యోదంతంలో సంచలన విషయాలు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.