యాప్నగరం

గుంటూరులో హోంగార్డు ఆత్మహత్య.. కడపలో విషాదం

రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పీరా సూసైడ్ చేసుకున్నాడు. మంగళగిరిలో అద్దె ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సూసైడ్ నోట్‌ రాసి పెట్టినట్లు సమాచారం.

Samayam Telugu 4 Jun 2020, 6:18 pm
గుంటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు మహమ్మద్ పీరా(24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా మైదుకూరుకి చెందిన పీరా గతంలో ఏపీ డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తించేవాడు. ప్రస్తుతం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పని చేస్తున్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Guntur suicide


మంగళగిరిలోని వడ్లపూడి సెంటర్‌లో నివాసం ఉంటూ రోజూ విధులకు వెళ్లేవాడు. సడెన్‌గా తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో శవమై తేలాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. తన చావుకు ఎవరూ కారణం కాదని డైరీలో రాసి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే డైరీలో ఏటీఎం పిన్ వివరాలు కూడా రాసుకున్నట్లు సమాచారం. ఉదయం 10 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. హోంగార్డు ఆత్మహత్యతో అతని స్వగ్రామంలో విషాదం నెలకొంది.

Also Read: భార్య చెల్లెలిపై కామంతో రెచ్చిపోయిన బావ.. ఆమెకి తెలిసిపోవడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.