యాప్నగరం

Kadapa: ఇడుపులపాయలో విషాద ఘటన

హిందూపురానికి చెందిన విద్యార్థి ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్నాడు. అనూహ్యంగా గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 12 Dec 2020, 6:03 pm
కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన సాయి మనోజ్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. హాస్టల్‌లో ఉంటున్న సాయి మనోజ్ ఎవరూ లేని సమయంలో గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బయటికి వెళ్లి వచ్చిన స్నేహితులు తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూసి షాక్‌కి గురయ్యారు. లోపల ఉరికి వేలాడుతున్న సాయి మనోజ్‌ని చూసి భయాందోళనకు గురై వెంటనే హాస్టల్ వార్డెన్‌కి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


Also Read: అప్పట్లో అమరావతిలో 50 ఎకరాల ఆసామి.. చివరికి హైదరాబాద్‌ చేరి.. షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.