యాప్నగరం

11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. కామాంధుడికి చచ్చేవరకు జైలుశిక్ష

సాయికృష్ణ తనపై గతంలోనూ అనేకసార్లు అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో నిందితుడిపై కేసు నమోదుచేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం దోషికి చనిపోయేంతవరకు జైలులోనే ఉంచాలని తీర్చు చెప్పడంతో పాటు అతడికి రూ.2లక్షల జరిమానా విధించారు.

Samayam Telugu 30 Nov 2019, 11:56 am
మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం చనిపోయేవరకు ఖైదు విధించిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కడప జిల్లాకు చెందిన బాలిక(11) ముత్తుకూరులోని తన అమ్మమ్మ దగ్గర కొంతకాలం ఉండేందుకు వచ్చింది. ఈ బాలిక తరచూ దగ్గరలోని కిరాణాషాపునకు వెళ్లి వస్తుండేది. దీన్ని గమనించిన ముత్తుకూరు ఎమ్మార్వో కాలనీ మల్లిపాటి సాయికృష్ణ బాలికపై కన్నేశాడు.
Samayam Telugu girl rape


Also Read:ప్రియాంకరెడ్డి శవాన్నీ వదలని కామాంధులు.. చనిపోయాక కూడా అనేకసార్లు అత్యాచారం

ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పలు పర్యాయాలు ఆమెపై లైంగిక దాడి జరిపాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి చాక్లెట్లు కొనిచ్చేవాడు. 2015, మే 21వ తేదీన కిరాణా షాపుకి వెళ్లి బాలికను సాయికృష్ణ మరోసారి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక మరుసటి రోజు తన తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: హైదరాబాద్‌లో ఘోరం.. కన్నకూతురిపైనే తండ్రి అఘాయిత్యం

సాయికృష్ణ తనపై గతంలోనూ అనేకసార్లు అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో నిందితుడిపై కేసు నమోదుచేశారు. సాయికృష్ణపై మోపిన అభియోగాలు నిరూపణ కావడంతో నెల్లూరు ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో జడ్జి జీఎస్. రమేశ్‌కుమార్ సాయికృష్ణను చనిపోయేంతవరకు జైలులోనే ఉంచాలని తీర్చు చెప్పడంతో పాటు అతడికి రూ.2లక్షల జరిమానా విధించారు.

Also Read: పెళ్లి చేసుకోలేదని ఫేస్‌బుక్ ఫ్రెండ్ ‌ హత్యకు ప్లాన్ వేసిన మహిళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.