యాప్నగరం

కర్ణాటకలో ముగ్గురు కామాంధులకు ఉరిశిక్ష

కర్ణాటకలో రెండు అత్యాచార ఘటనల్లో కోర్టులు ముగ్గురు కామాంధులకు మరణశిక్ష విధించాయి. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 65ఏళ్ల వ్యక్తికి. యువతిపై హత్యాచారం కేసులో ఇద్దరు యువకులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పులు వెలువరించాయి.

Samayam Telugu 19 Jan 2020, 9:36 am
నిర్భయ కేసు నిందితులను ఉరిశిక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలోనే కర్ణాటకలోని రెండు న్యాయస్థానాలు కామాంధులకు మరణశిక్షలు విధిస్తూ తీర్పులు చెప్పాయి. మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో 65 ఏళ్ల వృద్ధుడికి కోలార్ రెండో సెషన్స్‌ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. భైరండహళ్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప 2018, మే 1వ తేదీన అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై వేమగల్‌ పోలీస్‌‌స్టేషన్లో కేసు నమోదైంది. నేరం నిరూపణ కావడంతో జడ్జి రేఖ ఆ కామాంధుడికి ఉరిశిక్ష విధించారు.
Samayam Telugu death-P-110417


Also Read: తెలంగాణలో మిస్టరీగా మారిన మెడికో మృతి.. హత్యా? ఆత్మహత్యా?

చిక్కమంగళూరు జిల్లా శృంగేరిలో కాలేజీ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన కేసులో ఇద్దరు మృగాళ్లకు స్పెషల్ కోర్టు మరణశిక్షను విధించింది. 2016, ఫిబ్రవరి 16న శృంగేరి తాలూకా మెణసె గ్రామానికి చెందిన యువతి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుంగా ఆదే గ్రామానికి చెందిన సంతోష్, ప్రదీప్‌ ఆమెను ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చంపేసి పాడుబడిన బావిలో పడేసి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్, ప్రదీప్‌ను అరెస్ట్ చేసి కేసు విచారణ చేపట్టారు. పక్కా ఆధారాలు కోర్టులో సమర్పించడంతో చిక్కమంగళూరు స్పెషల్ కోర్టు జడ్జి ఎం.ఉమేశ్‌ అడిగ వారిద్దరిని దోషఉలుగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Also Read: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.