యాప్నగరం

ఫ్యాషన్ డిజైనర్‌తో డాక్టర్ అఫైర్.. ఇంజెక్షన్ ఇచ్చి భార్య హత్య.. కాల్స్ డేటాతో గుట్టురట్టు

ప్రియురాలితో ఉండేందుకు భార్యను హత్య చేసిన డాక్టర్ రేవంత్. పోస్టుమార్టం రిపోర్టులో అసలు నిజం వెల్లడి కావడంతో రైలు కింద పడి ఆత్మహత్య. ప్రియుడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి హర్షిత ఆత్మహత్య

Samayam Telugu 24 Feb 2020, 3:23 pm
వివాహేతర సంబంధం ఓ ఉన్నత కుటుంబాన్ని చిదిమేసింది. భార్యను అడ్డు తొలగించుకుని ప్రియురాలితో ఎంజాయ్ చేద్దామని ఓ డాక్టర్ వేసిన ప్లాన్ ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. డాక్టర్ చేతిలో భార్య హత్యకు గురికాగా.. ఆ విషయం బట్టబయలు కావడంతో అతడూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి ప్రియురాలు సైతం ప్రాణాలు తీసుకుంది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.
Samayam Telugu karnataka doctor kills wife before he commits suicide over illegal affair
ఫ్యాషన్ డిజైనర్‌తో డాక్టర్ అఫైర్.. ఇంజెక్షన్ ఇచ్చి భార్య హత్య.. కాల్స్ డేటాతో గుట్టురట్టు


​ఏడేళ్ల క్రితం వివాహం

చిక్కమంగళూరు జిల్లా కడూరులో డాక్టర్‌ రేవంత్‌ ఉడుపిలోని లక్ష్మీనగరకు చెందిన బసవరాజప్ప కుమార్తె కవితతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు(ఐదేళ్లు, 6నెలలు) ఉన్నారు. బీరూరులో డెంటల్ క్లినిక్ నడుపుతున్న రేవంత్‌కు బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్షిత(32)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.

​తనతో వచ్చేయాలని ప్రియురాలి ఒత్తిడి

భార్యకు విడాలిచ్చి తన దగ్గరికి వచ్చేయాలని హర్షిత ప్రియుడిని కొద్దిరోజులుగా కోరుతోంది. ఈ క్రమంలోనే 17వ తేదీన కవిత ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తన భార్యను ఎవరో హత్య చేశారని రేవంత్ ఫిర్యాదు చేయడంతో కడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం డాక్టర్లు ఇచ్చిన కవిత పోస్టుమార్టం రిపోర్టులో ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గొంతు నులిమి చంపేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులకు రేవంత్‌పై అనుమానం కలిగింది.

​కాల్స్‌డేటాతో గుట్టురట్టు

దీంతో అతడి కాల్స్‌డేటాను పరిశీలించగా భార్యను హత్య చేసే విషయంపై ప్రియురాలితో మాట్లాడిన కాల్స్ గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ శుక్రవారం చిక్కమంగళూర్ జిల్లా కడూరు తాలూకు బండికొప్పలు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు కొద్ది నిమిషాల ముందు తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు రేవంత్ హర్షితకు ఫోన్ చేసి చెప్పాడు.

​ప్రియుడి మరణవార్త తెలిసి హర్షిత సూసైడ్

ప్రియుడి ఆత్మహత్యతో మనస్తాపం చెందిన హర్షిత బెంగళూరులోని ఆర్ఆర్ నగర జవరేగౌడ లేఔట్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి మరణం తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం ముగ్గురి ప్రాణాలు తీయడంతో పాటు ఇద్దరు చిన్నారులను అనాథలుగా మార్చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.