యాప్నగరం

స్వలింగ సంపర్కానికి సహకరించట్లేదని మర్మాంగాన్ని కత్తిరించి.. పెళ్లి చేసుకోకూడదంటూ..

కర్ణాటకలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వలింగ సంపర్కానికి సహకరించట్లేదనే ఆగ్రహంతో ఓ యువకుడు తన స్నేహితుడిపై కత్తితో దాడి చేసి, అతని మర్మాంగాన్ని కత్తిరించాడు. పరువు పోతుందనే భయంతో ఈ విషయాన్ని బాధితుడు సైతం దాచిపెట్టారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.

Samayam Telugu 7 Dec 2022, 11:20 am
కర్ణాటకలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వలింగ సంపర్కానికి సహకరించట్లేదనే ఆగ్రహంతో ఓ యువకుడు తన స్నేహితుడిపై కత్తితో దాడి చేసి, అతని మర్మాంగాన్ని కత్తిరించాడు. పరువు పోతుందనే భయంతో ఈ విషయాన్ని బాధితుడు సైతం దాచిపెట్టారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
Samayam Telugu karnataka gay cuts student penis for not continue sexual relationship accused arrested
స్వలింగ సంపర్కానికి సహకరించట్లేదని మర్మాంగాన్ని కత్తిరించి.. పెళ్లి చేసుకోకూడదంటూ..



కాలేజీ విద్యార్థితో సంబంధం..

కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకా పరిధిలోని సీతాపుర గ్రామంలో సునీల్ కుమార్ అలియాస్ సుని నివసిస్తున్నాడు. అదే జిల్లా కేఆర్ పేటెలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థితో అతడికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రతి శుక్రవారం కలుసుకునేవాడు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 14వ తేదీన బాధిత విద్యార్థి తీవ్ర రక్తస్రావంతో సీతాపుర రైల్వే గేట్ సమీపంలో స్థానికులకు కనిపించాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.

పరువు పోతుందనే భయంతో..

స్థానికులు బాధిత విద్యార్థిని ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై శ్రీరంగపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పరువు పోతుందనే భయంతో బాధిత విద్యార్థి అసలు విషయాన్ని పోలీసులకు చెప్పేందుకు నిరాకరించాడు. కళాశాల నుంచి వస్తుండగా తనను ముగ్గురు వ్యక్తులు ఓ కారులో కిడ్నాప్ చేసి, అనంతరం తన మర్మాంగాన్ని కత్తిరించారని పోలీసులకు వివరించాడు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి రాలేదు.

పెళ్లి చేసుకోకూడదనే..

బాధితుడు చెప్పిన విధంగా దర్యాప్తు చేపట్టగా.. కేసులో పురోగతి సాధించకపోవడంతో మరోసారి పోలీసులు బాధిత విద్యార్థిని విచారించారు. దీంతో బాధితుడు అసలు విషయాన్ని అంగీకరించాడు. సీతాపుర గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తితో చోటు చేసుకున్న ఘర్షణ సందర్భంగా అతను మర్మాంగాన్ని కత్తిరించినట్లు వెల్లడించాడు. తనతోనే ఉండాలని, భవిష్యత్తులో పెళ్లి కూడా చేసుకోకూడదంటూ సునీల్ కుమార్ తనను ఆదేశించాడని, ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తిందని చెప్పాడు. తనకు పెళ్లి జరగకూడదనే ఉద్దేశంతో మర్మాంగాన్ని కత్తిరించాడని తెలిపాడు.

సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా..

దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీరంగపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే సునీల్ కుమార్ పరారయ్యాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బెంగళూరు, మైసూరు సహా పలు నగరాల్లో తలదాచుకున్నాడు. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, శ్రీరంగపట్టణానికి తీసుకొచ్చారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.