యాప్నగరం

Mandya: ముగ్గురిని బలి తీసుకున్న టీనేజ్ లవ్‌స్టోరీ

కాంచన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె బంధువులు రోజూ ఆస్పత్రికి వచ్చి చూస్తున్నారు. ఈ క్రమంలోనే 16వ తేదీన ఆమె తాతా చంద్రు(65) మనవరాలిని చూసేందుకు వచ్చాడు.

Samayam Telugu 23 Oct 2019, 3:04 pm
Samayam Telugu love

ప్రేమ వ్యవహారం ముగ్గురి ప్రాణాలు తీసిన ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది. నాగమంగల తాలూకా మంచనహళ్లి గ్రామానికి కాంచన(16), హొన్నెహళ్లి గ్రామానికి చెందిన యశ్వంత్ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల కాంచన తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తనను తిడతారేమోనన్న ఆందోళనతో కాంచన ఈ నెల 5వ తేదీన విషయం తాగేసింది. నొప్పితో విలవిల్లాడుతున్న బాలికను తల్లిదండ్రులు వెంటనే బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Also Read: కోరిక తీర్చాలని వేధించిన ‘గే’ బాస్.. చంపి మూడు ముక్కలు చేసిన ఉద్యోగి

కాంచన చికిత్సకు స్పందించకపోవడంతో ఇక బతకడం కష్టమని ఇంటికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అయినా కుమార్తెను బతికించుకోవాలన్న ఆశతో వారు మరో ఆస్పత్రిలో ఆమెను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తమ కుమార్తె పరిస్థితికి యశ్వంతే కారణమని కాంచన తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కొడుకు అరెస్ట్ కావడంతో పరువు పోయిందని భావించిన యశ్వంత్ తండ్రి 10వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: వ్యభిచారం చేయాలంటూ భార్యకు వేధింపులు.. బుద్ధి చెప్పిన స్థానికులు

కాంచన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె బంధువులు రోజూ ఆస్పత్రికి వచ్చి చూస్తున్నారు. ఈ క్రమంలోనే 16వ తేదీన ఆమె తాతా చంద్రు(65) మనవరాలిని చూసేందుకు వచ్చాడు. కాంచనను బెడ్‌పై చూడగానే ఆయనకు గుండెపోటు వచ్చి అదే ఆస్పత్రిలో చనిపోయాడు. పరిస్థితి విషమించడంతో కాంచన ఆదివారం(అక్టోబర్ 20) మృతిచెందింది. దీంతో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టీనేజీలో ప్రేమ, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read: కోరిక ఆపుకోలేకపోయిన డాక్టర్.. ఆస్పత్రిలోనే నర్సుతో సెక్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.