యాప్నగరం

ఛార్జింగ్ పెట్టి సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ మహిళ దుర్మరణం

ఛార్జింగ్‌లో ఉన్న సెల్ ఫోన్ మాట్లాడుతూ 30 ఏళ్ల ఓ మహిళ దుర్మరణం పాలైంది. కరెంట్ షాక్‌కు గురవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ దారుణం జరిగింది.

Samayam Telugu 14 Mar 2019, 1:14 pm
సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి కాల్ మాట్లాడుతూ ఓ మహిళ దుర్మరణం పాలైంది. కరెంట్ షాక్‌కు గురవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. మాండ్య జిల్లా కబ్బరే గ్రామానికి చెందిన సౌభాగ్య (30) తన సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగా.. మరో వ్యక్తితో ఫోన్ మాట్లాడింది. ఆ తర్వాత అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది.
Samayam Telugu Charging


గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. కరెంట్ షాక్ వల్లే మహిళ మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు..

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సెల్ ఫోన్‌ ఛార్జింగ్‌లో పెట్టి ఉండగా వాడకూడదని పదే పదే హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతుండటంతోనే ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.
Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.