యాప్నగరం

పిల్లల ముందే ప్రియుడితో రొమాన్స్.. మహిళకు షాకిచ్చిన కోర్టు

పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా వక్రబుద్ధి పట్టిన మహిళ ప్రియుడితో కలిసి బరితెగించింది. పిల్లల ముందే అతడితో రొమాన్స్ చేస్తూ అమ్మతనానికి మచ్చగా నిలిచింది. దీంతో భర్త ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు.

Samayam Telugu 12 Jan 2020, 4:10 pm
భర్త, ఇద్దరు పిల్లలతో బుద్ధిగా కాపురం చేసుకోవాల్సిన మహిళ పెడదోవ పట్టింది. పరాయి వ్యక్తి మోజులో పడి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసింది. పిల్లల ముందే ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ అమ్మతనానికే మచ్చ తెచ్చింది. క్షణికాల సుఖం కోసం కట్టుకున్నోడినే చంపేందుకు యత్నించింది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త విడాకులకు దరఖాస్తు చేసుకుంటే అతడిపైనే ఆరోపణలు చేసింది. చివరికి పిల్లల వాంగ్మూలం తీసుకున్న న్యాయస్థానం ఆమెకు షాకిచ్చేలా తీర్పు చెప్పింది.
Samayam Telugu illegal-affair_1200x900xt


Also Read: కూతురిని చంపేస్తామని బెదిరించి.. తల్లిపై ఆరుగురి గ్యాంగ్ రేప్

కర్ణాటకలోని అంకోలాకు చెందిన సురేశ్‌(పేరు మార్చాం)కు 1993లో రమ(పేరు మార్చాం)అనే మహిళతో వివాహమైంది. పెళ్లయిన తర్వాత అత్తమామలతో కలిసి ఉండేందుకు ఆమె అంగీకరించకపోవడంతో వేరు కాపురం పెట్టించారు. కొంతకాలానికి వారికి ఇద్దరు(బాబు, పాప) పుట్టారు. ఆమె ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో సురేశ్ వేరే ఊరికి కాపురాన్ని మార్చాడు. భార్య తరుచూ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతుండటంతో భర్త నిలదీయగా బంధువులు అని చెప్పేది. 2007 అక్టోబర్ నెలలో ఓ రోజు రాత్రి సమయంలో ఆమె ఫోన్‌కు గుడ్‌ నైట్ డార్లింగ్.. ఐ లవ్ యూ’ అంటూ మెసేజ్ రావడంతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే నిద్రపోతున్న భర్తపై పెట్రోల్ పోసి చంపేందుకు రమ్య యత్నించగా అతడు త్రుటిలో తప్పించుకున్నాడు.

Also Read: ‘26 మందితో సెక్స్ చేశా... నీకూ నా మగతనం చూపిస్తా’.. మహిళా ఎస్‌ఐకి లైంగిక వేధింపులు

పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నా ఆమె ప్రవర్తనతో మార్పు రాకపోగా వారి ముందే బరితెగించి ప్రవర్తించేది. అప్పుడప్పుడు ప్రియుడిని కలిసేందుకు ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లి పిల్లల ఎదుటే అతడితో చనువుగా ఉండేది. ముద్దులు, హగ్గులు ఇస్తూ అసభ్యంగా ప్రవర్తించేది. ఈ విషయాన్ని పిల్లలు తండ్రికి చెప్పడంతో భార్య తనను మోసం చేస్తోందంటూ కోర్టకెక్కి విడాకులు తీసుకున్నాడు. న్యాయస్థానం అనుమతితో పిల్లల సంరక్షణ బాధ్యతలు కూడా తానే తీసుకున్నాడు. అయితే భర్త పిల్లలను తన నుంచి దూరం చేశాడన్న కోపంతో రమ్య కోర్టును ఆశ్రయించింది. పిల్లల బాధ్యత తల్లిగా తనకు అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే తప్పుడు ప్రవర్తన కలిగిన తల్లి దగ్గర ఉండేందుకు పిల్లలు అంగీకరించకపోవడంతో న్యాయస్థానం ఆమె పిటిషన్ కొట్టేసింది.

Also Read: ట్యూషన్‌కి వచ్చే బాలికలపై టీచర్ పైశాచికం.. వీడియోలు తీసి బాయ్‌ఫ్రెండ్‌కు షేర్ చేస్తూ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.