యాప్నగరం

బాలికపై తండ్రి సహా 30 మంది అఘాయిత్యం.. రెండేళ్లుగా నరకం

కంటికి రెప్పలా కన్న కూతురిని కాపాడాాల్సిన తండ్రే ఆమెను చిదిమేశాడు. తాను అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు తన ఫ్రెండ్స్‌ను కూడా ఆమెపై అత్యాచారం చేసేలా ఉసిగొల్పాడు. రెండేళ్ల నుంచి పంటి బిగువున బాధను భరిస్తూ వచ్చిన బాలిక ఈ విషయాన్ని స్కూల్ టీచర్లకు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Samayam Telugu 23 Sep 2019, 12:09 pm
కేరళలోని మలప్పురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెలారి ప్రాంతంలో ఏడో తరగతి చదువుతున్న బాలిక(12)పై తండ్రి సహా 30 మంది కామాంధులు రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తనపై జరుగుతున్న దారుణాన్ని బాలిక ఉపాధ్యాయులకు చెప్పడంతో పోలీసులు ఆమె తండ్రితో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Samayam Telugu girl rape


Also Read: భార్య ఇంట్లో లేని సమయం చూసి మరదలిపై అఘాయిత్యం

చదువులో చురుగ్గా ఉండే బాలిక ఇటీవల స్కూల్‌కి కూడా సరిగా రాకపోవడాన్ని టీచర్లు గుర్తించారు. ఏం జరిగిందని బాలికను ప్రశ్నించగా తనపై జరుగుతున్న దారుణాన్ని చెప్పి బోరుమంది. దీంతో వారు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారమిచ్చి ఆమెను శనివారం కమిటీ ఎదుట హాజరుపరిచారు. వారి ఆదేశాల మేరకు మలప్పురం పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు. బాలిక తండ్రితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Also Read: ‘కోరిక తీర్చకపోతే ఫెయిల్ చేస్తా’.. నర్సింగ్ స్టూడెంట్‌కు లైంగిక వేధింపులు

తనకు పదేళ్ల వయస్సు నుంచి తండ్రి తనపై తరుచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాలిక చైల్డ్ వెల్ఫేర్ అధికారుల చెప్పింది. దీన్ని అలుసుగా తీసుకుని అతడి స్నేహితులు కూడా తరుచూ ఇంటికొచ్చి అఘాయిత్యానికి పాల్పడేవారని తెలిపింది. తండ్రి ఒత్తిడి కారణంగానే తాను చాలా రోజులు బడి మానేసి ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని వెల్లడించినట్లు చైల్డ్ లైన్ అధికారి అన్వర్ తెలిపారు.

Also Read: కీచక కాంపౌండర్.. ఆపరేషన్ థియేటర్‌లోనే యువతిపై రేప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.