యాప్నగరం

Khammam: వ్యక్తిపై హెడ్ కానిస్టేబుల్ దాడి.. విడాకుల కేసులో వివాదం

ఖమ్మం పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ వీరంగం. తన కుమారుడికి అమ్మాయిని ఇచ్చి వివాహం చేసిన వ్యక్తిపై దౌర్జన్యం. విడాకుల కేసులో వివాదం. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఘటన.

Samayam Telugu 1 Jul 2019, 10:50 pm
మ్మం జిల్లా కేంద్రంలో ఓ హెడ్ కానిస్టేబుల్ వీరంగం చేశాడు. తన కుమారుడికి కూతుర్ని ఇచ్చి వివాహం చేసిన వ్యక్తిపై దాడి చేశాడు. విడాకుల కేసులో కోర్టుకు హాజరై వస్తుంటే ఈ దాడి జరిగింది. సోమవారం (జులై 1) ఉదయం ఖమ్మం కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగజ్‌నగర్‌లో అటవీ అధికారిణి అనితపై దాడి ఘటన విషయంలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతుండగానే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu khammam head constable attacks man at court premises over divorce dispute
Khammam: వ్యక్తిపై హెడ్ కానిస్టేబుల్ దాడి.. విడాకుల కేసులో వివాదం


ఖమ్మం కోర్టులో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు కుమారుడు విజయ్ భాస్కరాచారికి అబ్బనపురి వెంకటేశ్వర్లు కుమార్తె భవానీని ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. అయితే.. పెళ్లి జరిగిన వారం రోజులకే తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలతో అమ్మాయి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత విడాకులు కావాలంటూ తండ్రితో కలిసి కోర్టులో పిటిషన్ వేసింది.

ఖమ్మం కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం కోర్టుకు వెళ్లి వస్తుండగా.. తమపై హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విచక్షణా రహితంగా దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ మేరకు ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.