సాగర నగరం విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలంరేపింది. అమాయకులకు డబ్బు ఆశచూపి కిడ్నీలు దోచేస్తున్న గ్యాంగ్ గుట్టును ఓ బాధితుడు బట్టబయలు చేశాడు. ఈ కిడ్నాప్ గ్యాంగ్ ఆగడాలు చూసి పోలీసులే షాక్ తింటున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖలో ఈ దందా జరుగుతున్నట్లు తేలింది. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రితో చేతులు కలిపిన దళారులు.. ఎంతోమంది అమాయకుల్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ కిడ్నాప్ రాకెట్ను బట్టబయలు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన పార్థసారధికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. అప్పుల బెడద ఎక్కువైపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అప్పుడే బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే దళారితో పరిచయం ఏర్పడింది. పార్థసారధి కష్టాల గురించి తెలుసుకున్న మంజునాథ్.. డబ్బు ఆశచూపడంతో కిడ్నీ అమ్మడానికి సారధి ఓకే చెప్పాడు. బెంగుళూరుకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి కిడ్నీ మార్పిడి అవసరం కావడంతో.. రూ.12 లక్షలకు సారధితో డీల్ కుదుర్చుకున్నారు.. అది కూడా రెండు విడతలుగా ఇస్తామన్నారు.
ఒప్పంద ప్రకారం తొలి విడతగా రూ.5లక్షలు పార్థసారధికి అందజేశారు. రోగిని విశాఖకు తీసుకువచ్చి శ్రద్ధా ఆస్పత్రిలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో గతేడాది జులైలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు. సీన్ కట్ చేస్తే పార్థసారధికి ఇవ్వాల్సిన రూ.7లక్షలు ఇవ్వకుండా మంజునాథ్ మోసం చేశాడు. ఇన్ని రోజులు డబ్బు చెల్లిస్తారని ఆశగా చూసిన సారధి.. మంజునాథ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. విశాఖలోని మహారాణిపేట పోలీసులను ఆశ్రయించాడు. సీఐ ఈ వ్యవహారంపై రహస్యంగా విచారణ ప్రారంభించారు. ఆస్పత్రికి పోలీసులు నోటీసులు పంపించారు. అలాగే బెంగుళూరుకు చెందిన మంజునాథ్ను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మల్లప్ప మంజునాథ్, బీఎస్ ప్రభాకర్, దొడ్డి ప్రభాకర్, వెంకటేశ్ మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యం కిడ్ని దాత, కిడ్నీ గ్రహీతకు సోదరుడిగా నకిలీ ఆధార్, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింనట్లు తేలిందని సీపీ లడ్డా తెలిపారు. కిడ్నీ ఇచ్చిన వారికి కేవలం రూ.5 లక్షలు చెల్లించారని.. మిగతా రూ.7 లక్షలు చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు మంజునాథ్కు శ్రద్ధ హస్పిటల్ యాజమాన్యానికి ముందు నుంచే సంబంధాలు ఉన్నాయన్నారు. శ్రద్ధ ఆస్పత్రిలో 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్లు తేలిందన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని.. తప్పు చేసినవారిపై చర్యలు తప్పవన్నారు.
ఒప్పంద ప్రకారం తొలి విడతగా రూ.5లక్షలు పార్థసారధికి అందజేశారు. రోగిని విశాఖకు తీసుకువచ్చి శ్రద్ధా ఆస్పత్రిలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో గతేడాది జులైలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు. సీన్ కట్ చేస్తే పార్థసారధికి ఇవ్వాల్సిన రూ.7లక్షలు ఇవ్వకుండా మంజునాథ్ మోసం చేశాడు. ఇన్ని రోజులు డబ్బు చెల్లిస్తారని ఆశగా చూసిన సారధి.. మంజునాథ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. విశాఖలోని మహారాణిపేట పోలీసులను ఆశ్రయించాడు. సీఐ ఈ వ్యవహారంపై రహస్యంగా విచారణ ప్రారంభించారు. ఆస్పత్రికి పోలీసులు నోటీసులు పంపించారు. అలాగే బెంగుళూరుకు చెందిన మంజునాథ్ను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మల్లప్ప మంజునాథ్, బీఎస్ ప్రభాకర్, దొడ్డి ప్రభాకర్, వెంకటేశ్ మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యం కిడ్ని దాత, కిడ్నీ గ్రహీతకు సోదరుడిగా నకిలీ ఆధార్, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింనట్లు తేలిందని సీపీ లడ్డా తెలిపారు. కిడ్నీ ఇచ్చిన వారికి కేవలం రూ.5 లక్షలు చెల్లించారని.. మిగతా రూ.7 లక్షలు చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు మంజునాథ్కు శ్రద్ధ హస్పిటల్ యాజమాన్యానికి ముందు నుంచే సంబంధాలు ఉన్నాయన్నారు. శ్రద్ధ ఆస్పత్రిలో 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్లు తేలిందన్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని.. తప్పు చేసినవారిపై చర్యలు తప్పవన్నారు.