యాప్నగరం

ఫిలిప్పీన్స్‌లో కృష్ణా విద్యార్థి దుర్మరణం

కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వైద్య విద్యార్థి ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ప్రస్తుతం అతడు వెటర్నరీ వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.

Samayam Telugu 31 Dec 2019, 5:55 pm
ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా నందిగామలోని నేతాజీనగర్‌కు చెందిన పొన్నపల్లి జగదీష్‌ (22) దుర్మరణం చెందాడు. వైద్య విద్య కోసం 2016లో జగదీష్‌ ఫిలిప్పీన్స్‌ వెళ్లాడు. ప్రస్తుతం జగదీష్‌ వెటర్నరీ వైద్య విద్యలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం జగదీష్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన జగదీష్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, జగదీష్‌ మృతితో నేతాజీ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Samayam Telugu Jagadish


Also Read: ఆస్ట్రేలియాలో భారత నవ దంపతుల దుర్మరణం

కాగా, ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళకు చెందిన ఇద్దరు నవ దంపతులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని వెంగోలకు చెందిన అల్బిన్ టీ మాథ్యూస్ (30), నిను సుసెన్ ఏల్ధో (28) దంపతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వెంగోలలోని వలసాల తొంబర హౌజ్‌కు చెందిన అల్బిన్ తండ్రి మాథ్యూస్ ఎస్ఐగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. కొత్తమంగళంలోని సరమ్మ పుతుమనక్కుడియిల్‌ హౌజ్‌కు చెందిన నిను తండ్రి ఏల్ధో రిటైర్డ్ ఎల్ఐసీ ఆఫీసర్. ఇలా, విదేశాల్లో భారతీయుల వరుస మరణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: దైవదూషణ కేసులో ప్రొఫెసర్‌కు మరణ శిక్ష!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.