యాప్నగరం

కృష్ణాలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య!

కృష్ణా జిల్లా గొల్లపూడి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మైగ్రేన్‌ తలనొప్పిని తాళలేక తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు.

Samayam Telugu 30 Dec 2019, 3:09 pm
కృష్ణా జిల్లా తిరువూరులోని విజన్‌ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంపలగూడెం మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన జీవన్ మణికంఠ (15) తిరువూరు విజన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి దూకేశాడు.
Samayam Telugu death


Also Read: ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని.. యువకుడి ఆత్మహత్య!

దీంతో తీవ్ర గాయాలపాలైన మణికంఠను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. కాగా, మైగ్రేన్‌ తలనొప్పిని తాళలేక తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే పాఠశాల వద్దకు చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భార్య రూ. 10 లక్షల అప్పు.. భర్త ఆత్మహత్య!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.