యాప్నగరం

కాపురానికి రావాలని కోరిన భర్త.. పురుషాంగం కోసేసిన భార్య

కాపురానికి రావాలని అడిగిన భర్తను మహిళ చితకబాది పురుషాంగం కోసేసిన ఘటన కర్నూలు జిల్లా గడివేముల మండలంలో చోటుచేసుకుంది. బాధితుడిని స్థానికుల నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Samayam Telugu 19 Sep 2019, 4:18 pm
కాపురానికి రావాలని కోరిన భర్తపై అమానుషంగా వ్యవహరించిందో ఇల్లాలు. కుటుంబసభ్యులతో కలిసి చితకబాది తాళ్లతో కట్టేసింది. అతడి పురుషాంగాన్ని కోసేసింది. ఈ అమానవీయ ఘటన కర్నూలు జిల్లాలో గురువారం జరిగింది.
Samayam Telugu pjimage (7)


Also Read: బాల్య స్నేహితుడే చెరబట్టాడు.. వివాహితను బెదిరించి రెండేళ్లుగా అత్యాచారం

కర్నూలు జిల్లా గడివేముల మండలం సోమాపురానికి చెందిన ఓ మహిళకు నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే విబేధాల కారణంగా ఆమె గత మూడేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. దీనిపై పెద్దల మధ్య పంచాయతీ నడిచినా దంపతుల మధ్య సయోధ్య కుదరలేదు.

Also Read: ప్రియుడితో పారిపోయిన తల్లి.. కన్న కొడుకులు ఏం చేశారంటే

ఈ క్రమంలోనే గురువారం అత్తారింటికి వచ్చిన భర్త కాపురానికి రావాలని భార్యను కోరాడు. ఆమె రానని ససేమిరా అనడంతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన భార్య తన బంధువులతో కలిసి అతడిపై దాడికి పాల్పడింది. తాళ్లతో చెట్టుకు కట్టేసి పురుషాంగం కోసేసింది. బాధతో విలవిల్లాడుతున్న బాధితుడిని స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: భర్తను వదిలేసి ప్రియుడితో అఫైర్.. వేధిస్తున్నాడని అన్నతో కలిసి హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.