యాప్నగరం

లేడీ లాయర్‌పై ఊమ్మేసిన ఐపీఎస్ భార్య.. ఆయనకి పాజిటివ్.!

లేడీ లాయర్ ఐపీఎస్ భార్యకి గొడవైంది. రెచ్చిపోయిన ఐపీఎస్ సతీమణి లాయర్‌పై ఉమ్మేసింది. అయితే ఆమె భర్త, ఐపీఎస్ అధికారికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో..

Samayam Telugu 4 Jul 2020, 3:56 pm
ఇద్దరు మహిళల మధ్య ఏర్పడిన వివాదం ఆఖరికి ఆ రాష్ట్ర పోలీస్ బాస్ వరకూ చేరింది. బెంగళూరు ఇన్‌ఫ్యాంట్రీ రోడ్డులోని చందన అపార్ట్‌మెంట్స్‌ గ్రౌండ్ ఫ్లోర్‌లో వందన వెంకటేష్ అనే మహిళా న్యాయవాది నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో ఐపీఎస్ అధికారి అజయ్ హిలోరి కుటుంబం ఉంటోంది. చిన్నపిల్లలు ఆటాడుకునే విషయమై జరిగిన గొడవ కాస్తా తీవ్రరూపం దాల్చి ఐపీఎస్ భార్య తనపై ఉమ్మేసిందని లాయర్ వందన ఆరోపిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
angry women


ఐపీఎస్ హిలోరి పిల్లలు ఆటలాడుతూ గొడవ చేయడంతో వారిని మందలించానని.. అందుకు ఐపీఎస్ భార్య హనీ హిలోరి తనతో గొడవకు దిగినట్లు తెలిపింది. చిన్నారులను వేధించానంటూ అదే రోజు సాయంత్రానికి ఏడుగురు పోలీస్ అధికారులు తన ఇంటికి వచ్చారని ఆమె పేర్కొంది. పోలీసులు రావడంతో వివరణ అడిగేందుకు తాను హిలోరి ఇంటికి వెళ్లానని.. ఆమె మరోమారు తనతో వాగ్వాదానికి దిగిందని వందన ఆరోపిస్తున్నారు.

Also Read: కోరిక తీర్చాలంటూ మహిళా ఉద్యోగికి నరకం.. ప్రభుత్వాస్పత్రిలో కీచకపర్వం

ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో ఐపీఎస్ భార్య హనీ హిలోరి తన ముఖంపై ఉమ్మేసిందని వందన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె భర్త అజయ్ హిలోరికి కోవిడ్ ‌- 19 పాజిటివ్ వచ్చిందని.. తను ఉమ్మేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని వందన తెలిపారు. తాను తిరిగి వస్తున్న సమయంలో కూడా పలుమార్లు తనపై ఉమ్మేసిందని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ఆమె బెంగళూరు పోలీస్ బాస్ భాస్కర్ రావుకి ఫిర్యాదు చేశారు. వందన ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read Also: మర్డర్‌కి మంది రెడీ.. కత్తులు రెడీ.. చివరి నిమిషంలో దిమ్మతిరిగే ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.