యాప్నగరం

భార్యకి ఉద్యోగం.. తనకి లేదన్న మనస్థాపంతో భర్త.. విశాఖలో విషాదం

లేడీ కానిస్టేబుల్ భర్త చినరాజు అనకాపల్లిలోని షాపింగ్ మాల్‌లో ఉద్యోగం చేసేవాడు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 29 May 2020, 11:45 am
లాక్‌డౌన్ లేడీ కానిస్టేబుల్ భర్త పాలిట శాపంగా మారింది. అప్పటి వరకూ ఉన్న ఉద్యోగం కరోనా పుణ్యమాని పోవడంతో మానసికంగా కుంగిపోయాడు. భార్యకు ఉద్యోగం ఉన్నా ఖాళీగా ఉంటున్నానన్న మనస్థాపంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రలో ఉండగా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పట్టణంలోని నరసింగరావుపేటలో చినరాజు(32), శ్యామల దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య శ్యామల కశింకోట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. భర్త స్థానికంగా ఓ షాపింగ్ మాల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా మాల్ మూతపడడంతో చినరాజు ఖాళీగా ఉంటున్నాడు.

Also Read:
ఏడో తరగతిలోనే హద్దులు దాటిన బాలిక.. గర్భం వస్తుందేమోనని..

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమవడం.. ఉన్న ఉద్యోగం కూడా పోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఉద్యోగం లేదన్న మనోవేదనతో అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:
కొత్త కోడలిపై కన్నేసిన మామ.. ఒంటరిగా ఉన్న సమయం చూసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.