యాప్నగరం

కాల్వలో శవమై తేలిన లేడీ డాక్టర్.. ఆ 3 గంటల్లో ఏమైంది? విశాఖలో మిస్టరీ మరణం

ఆస్పత్రికి వస్తున్నానని ఫోన్ చేసిన వైద్యురాలు పది గంటలైనా ఫోన్ తీయలేదు. ఇంటి నుంచి బయల్దేరిన ఆమె ఆస్పత్రికి చేరుకోలేదు. మార్గం మధ్యలో ఓ కాల్వలో శవమై కనిపించారు.

Samayam Telugu 5 Aug 2020, 2:51 pm
డ్యూటీకి బయల్దేరిన లేడీ డాక్టర్ కాల్వలో శవమై తేలిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యురాలిగా పనిచేస్తున్న మళ్ల శ్యామల(34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కశింకోట మండలంలోని తాళ్లపాలెం వద్ద ఏలేరు కాల్వలో విగతజీవిగా కనిపించారు. ఆస్పత్రికి వస్తున్నట్లు సిబ్బందికి ఫోన్ చేసి చెప్పిన డాక్టర్ శ్యామల కాల్వలో శవమై కనిపించడం మిస్టరీగా మారింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
doctor death


డాక్టర్ శ్యామల విశాఖలోని గాజువాక డిపో ఏరియాలో నివాసముంటున్నారు. ఆమె భర్త విజయవాడలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఐదేళ్ల బాబు, రెండేళ్ల కూతురు సంతానం. ఇటీవల కుమార్తె ఆరోగ్యం బాలేదని ఆమె సెలవులో వెళ్లినట్లు సమాచారం. గాజువాకలోని ఇంటి నుంచి డ్యూటీకి బయల్దేరిన ఆమె కాల్వలో శవమై కనిపించారు. ఆమె సీహెచ్‌వో ప్రతాప్ కారులో ఆస్పత్రికి వచ్చేవారని.. మంగళవారం బస్సులో వచ్చినట్లుగా తెలుస్తోంది.

Also Read: కొడుకుతో కోడలు సెక్స్ చేయకూడదట! అడ్డుపడుతున్న మామ.. చివరికి..

సెలవులో ఉన్న శ్యామల ఉదయం ఏడు గంటల సమయంలో పీహెచ్‌సీ సిబ్బందికి ఫోన్ చేసి విధులకు హాజరవుతున్నట్లు చెప్పారని.. అనంతరం పది గంటల నుంచి ఆమె ఫోన్ పనిచేయలేదని సిబ్బంది చెబుతున్నారు. మధ్యాహ్నం ఆమె మృతదేహం కాల్వలో కనిపించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్య చేసి పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. చాలా ధైర్యవంతురాలని సిబ్బంది చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read Also: ఆ సెక్స్ కోసం పిచ్చెక్కిపోయిన భర్త.. భరించలేని భార్య.. ఘాతుకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.