యాప్నగరం

వైన్ షాపులో చోరీ.. మద్యం బాటిళ్లు, డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాద్‌లోని ఓ వైన్ షాపులో చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటాక సీలింగ్‌కు రంధ్రం చేసి షాపులోకి ప్రవేశించిన దుండగులు.. మద్యం బాటిళ్లు, డబ్బును ఎత్తుకెళ్లారు.

Samayam Telugu 19 Dec 2019, 3:09 pm
హైదరాబాద్‌: రాజేంద్రనగర్ అత్తాపూర్ మంజు వైన్స్‌లో భారీ దొంగతనం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో వైన్ షాప్ పై భాగంలో రంధ్రం చేసిన దుండగులు.. షాపులోకి ప్రవేశించి మద్యం బాటిళ్లు చోరీ చేశారు. తిరిగి అదే రంధ్రం ద్వారా పారిపోయారు. మద్యం బాటిళ్లతోపాటు లాకర్‌లో ఉన్న డబ్బులు కూడా ఎత్తుకెళ్లారు. తెల్లవారిన తర్వాత షాప్ తెరిచిన యజమాని.. మద్యం బాటిల్స్‌తోపాటు నగదు కూడా పోయిందని గుర్తించాడు. షాప్ యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీస్తున్నారు.
Samayam Telugu లిక్కర్ షాపులో చోరీ


ఒకప్పుడు బంగారం దుకాణాలు, బ్యాంకుల్లో చోరీకి పాల్పడేవారు. తర్వాత సెల్ ఫోన్ దుకాణాల్లో చోరీలు జరిగాయి. ఇప్పుడు వైన్ షాప్‌లోనూ చోరీ జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. దీంతో డబ్బులు లేని తాగుబోతు ఎవరో ఈ పని చేసి ఉంటాడని జనాలు సరదాగా అనుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.