యాప్నగరం

ఇద్దరి ప్రాణాలు తీసిన సహజీవనం.. విషాదంలో రెండు కుటుంబాలు

బుధవారం కోవూరు మండలంలోని పల్లెపాళెం సమీపంలోని మలిదేవి వాగు వద్ద వేపచెట్టుకు వేలాడుతున్న పెంచలయ్య మృతదేహాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Samayam Telugu 14 Nov 2019, 10:31 am
తనతో సహజీవనం చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన చెందిన యువకుడు కేసు భయంతో తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో చోటుచేసుకుంది. ముత్తుకూరు గ్రామానికి చెందిన ముత్తుకూరు గ్రామానికి చెందిన మల్లెల వసంత, క్రిష్ణయ్య దంపతులకు పెంచలయ్య అనే కుమారుడు ఉన్నాడు. అతడు కొంతకాలంగా నెల్లూరు ఇరుగాళమ్మగుడి కాలనీకి చెందిన సుప్రజ అనే మహిళతో కొంతకాలంగా ముత్తుకూరులో సహజీవనం చేస్తున్నాడు.
Samayam Telugu images


Also Read: కృష్ణా జిల్లాలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై తాత అత్యాచారం

ఈ నెల 3వ తేదీన పెంచలయ్య లేని సమయంలో సుప్రజ ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. దీంతో తనపై పోలీసులు కేసు నమోదు చేస్తారన్న భయంతో అతడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం కోవూరు మండలంలోని పల్లెపాళెం సమీపంలోని మలిదేవి వాగు వద్ద వేపచెట్టుకు వేలాడుతున్న పెంచలయ్య మృతదేహాన్ని కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అతడు చనిపోయి నాలుగురోజులు కావడంతో మృతదేహం గుర్తుపట్టని విధంగా కుళ్లిపోయింది.

Also Read: ప్రొఫెసర్ల వేధింపులతోనే ఫాతిమా సూసైడ్.. భగ్గుమన్న మద్రాస్ ఐఐటీ

పెంచలయ్య తల్లి వసంత ఫిర్యాదుతో కోవూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. . ప్రియుడితో విబేధాలు రావడం వల్లే సుప్రజ చనిపోయిందని, ఈ ఘటనతో పోలీసులు తనను వేధిస్తారన్న భయంతోనే పెంచలయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Also Read: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో వివాహిత అక్రమ సంబంధం.. హోటల్లో రూమ్‌ తీసుకుని

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.