యాప్నగరం

వెటర్నరీ డాక్టర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కేసీఆర్ ప్రకటన చేయాలంటూ డిమాండ్

ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి బృందాన్ని గేటు వద్ద కాలనీవాసులు అడ్డుకున్నారు.

Samayam Telugu 1 Dec 2019, 10:49 am
హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణంగా చంపేసిన ఘటనపై ఆగ్రహజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఆమెకు న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా మహిళా, ప్రజా, విద్యార్థి సంఘాలతో పాటు అనేక వర్గాలు ఆందోళన చేపడుతున్నాయి. మరోవైపు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చే నేతలతో ఆమె ఇంటి వద్ద రద్దీ నెలకొంది.
Samayam Telugu pjimage (6)


Also Read: వెటర్నరీ డాక్టర్ రేప్ మర్డర్.. ప్లాన్ వేసింది, ముందుగా అఘాయిత్యానికి పాల్పడింది అతడే

అయితే ఈ ఘటనపై కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలతో పాటు, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి న్యాయం జరిగేవరకు మీడియాతో పాటు రాజకీయ నాయకులెవరూ అక్కడికి రావొద్దని కాలనీవాసులు బోర్డు పెట్టారు. ఆమె ఇంటి గేటుకు తాళం వేసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్నారు.

Also Read: ‘ నా కొడుకును కాల్చి చంపేయాలి’.. రేపిస్ట్ చెన్నకేశవులు తల్లి

Also Read: హైదరాబాద్‌లో మరో ఘోరం.. మహిళా టెక్కీపై ఫ్రెండ్ అత్యాచారం

ప్రియాంక కుటుంబసభ్యులను కలవడానికి ఎవరూ రావొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులను కూడా లోనికి అనుమతించబోమని హెచ్చరిస్తున్నారు. ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి బృందాన్ని గేటు వద్ద కాలనీవాసులు అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసేవరకు ఆందోళన విరమించబోమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: భర్త, బిడ్డలకు విషమిచ్చి.. ప్రియుడితో పారిపోయిన వివాహిత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.