యాప్నగరం

తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి, ఏడుగురికి గాయాలు

అక్రమంగా కర్రల లోడుతో వెళ్తున్న లారీ మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోనేి చెరువు కట్టపై బోల్తా పడింది. ఈ ఘటన నలుగురు చనిపోయారు.

Samayam Telugu 16 Jul 2020, 9:18 am
మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్టమీదుగా అక్రమంగా కర్ర లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో 11 మంది కూలీలు ఉండగా.. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆంబోతు హర్యా, ఆంబోతు గోవిందర్, ఆంబోతు మధు, రాట్ల ధూర్యాగా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu బోల్తా పడిన లారీ


Also Read: ఢిల్లీలో రేవ్ పార్టీ భగ్నం.. ఏడుగురు అమ్మాయిలు సహా 31 మంది అరెస్ట్

ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన ఏడుగురు కూలీలను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, ఎస్ఐ నగేష్, ఆర్డీవో ఈశ్వరయ్యలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు పర్యవేక్షించారు. లారీలో ఉన్న వారందరూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆంబోతులా తండాకు చెందిన వారుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: ఆస్తిలో వాటా అడిగిన ప్రియురాలు... చంపేపి పొలంలో పాతిపెట్టిన ప్రియుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.