యాప్నగరం

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కర్నూలులో దారుణం

రెండేళ్లుగా ప్రేమించుకుని దైవసాక్షిగా ఒక్కటయ్యారు. కులాలు వేరు కావడంతో పెద్దల నుంచి రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించారు. తమ పరిధి కాదంటూ పోలీసులు పంపించేయడంతో..

Samayam Telugu 10 Jul 2020, 4:05 pm
కర్నూలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది. సంఘటన జరిగిన ప్రదేశం తమ పరిధిలోనిది కాదని పోలీసులు చెప్పి పంపించడంతో నవజంట మనస్థాపానికి గురైంది. అండగా ఉంటారనుకున్న పోలీసులు వెళ్లిపొమ్మనడంతో ఏం చేయాలో దిక్కుతోచక బస్టాండ్‌లోనే విషం తాగేసి ఆత్మహత్యా యత్నం చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


కర్నూలు జిల్లా మద్దికెర మండలానికి చెందిన యువకుడు, అనంతపురం జిల్లా గుంతకల్లుకి చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి ఇంటి నుంచి వెళ్లిపోయారు. బుగ్గసంగమేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. తమకు పెద్దల నుంచి రక్షణ కావాలని మద్దికెర పోలీసులను ఆశ్రయించారు.

ఇరు కుటుంబాలను పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందుకు రెండు కుటుంబాల పెద్దలు ససేమిరా ఒప్పుకోలేదు. యువతీ యువకులను తమ వెంట పంపించేయాలని పట్టుబట్టారు. దీంతో విసిగిపోయిన పోలీసులు ఈ కేసు తమ పరిధిలోకి రాదని.. కసాపురం పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని పంపించేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని ప్రేమజంట అఘాయిత్యానికి పాల్పడింది.

Also Read: కూతురి ముచ్చట తీర్చలేక.. తనువు చాలించిన తండ్రి.. తిరుపతిలో విషాద ఘటన

స్టేషన్‌ నుంచి మద్దికెర బస్టాండ్‌కి చేరుకున్న ప్రేమికులు అక్కడే విషం తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. గమనించిన స్థానికులు ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం గుంతకల్లు పంపించారు. పరిస్థితి విషమంగా మారడంతో ప్రేమజంటను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read Also: భార్యతో ఫ్రెండ్ ఎఫైర్.! అనుమానంతో భర్త ఘాతుకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.